Publish Date: Fri, 23 Dec 2022 (17:42 IST)
Updated Date: Fri, 23 Dec 2022 (17:44 IST)
దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని 104 యూట్యూబ్ ఛానెల్లు, 45 వీడియోలు, 4 ఫేస్బుక్ ఖాతాలు, 3 ఇన్స్టాగ్రామ్ ఖాతాలు, 5 ట్విట్టర్ హ్యాండిల్స్, 6 వెబ్సైట్లను బ్లాక్ చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. సమాచార సాంకేతిక చట్టంలోని సెక్షన్ 69A,భారతదేశ సార్వభౌమాధికారం లేదా సమగ్రతను దృష్టిలో ఉంచుకుని డిజిటల్ మీడియాలోని కంటెంట్ను నిరోధించడం జరిగిందన్నారు.
భారతదేశ రక్షణ, రాష్ట్ర భద్రత, విదేశీ రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలను దృష్టిలో పెట్టుకుని తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేసే సామాజిక మాధ్యమాలపై కొరడా విధించినట్లు అనురాగ్ చెప్పారు. జాతీయ భద్రతకు ముప్పు కలిగించడం కోసం IT నిబంధనలలోని పార్ట్-IIనిబంధనల ప్రకారం 2021 నుండి అక్టోబర్ 2022 వరకు 1,643 యూజర్లు రూపొందించిన URLలను బ్లాక్ చేయాలని ప్రభుత్వం సోషల్ మీడియా కంపెనీలను ఆదేశించింది.