Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

50 నగరాల్లో 5జీ సేవలు.. గుజరాత్‌లో మాత్రం 33 నగరాలకు..?

5g
, బుధవారం, 14 డిశెంబరు 2022 (22:54 IST)
భారతదేశంలోని 14 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 50 నగరాల్లో 5జీ సేవలను ప్రారంభించినట్లు కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రకటించింది. ముఖ్యంగా గుజరాత్‌లో 33 నగరాలకు 5జీ సేవలు జరుగనున్నాయి. అలాగే మహారాష్ట్ర నుండి 3 నగరాలు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ నుండి 2 నగరాలు ఉన్నాయి. 
 
అలాగే, ఢిల్లీ, తమిళనాడు, చెన్నై, కర్ణాటక, తెలంగాణ, రాజస్థాన్, హర్యానా, అస్సాం, కేరళ, బీహార్, ఆంధ్రప్రదేశ్‌లలో ఒక్కొక్క నగరంలో 5Gసేవలు ప్రారంభం అయ్యాయి.
 
అక్టోబర్ 1న భారతదేశంలో 5Gసేవలు ప్రారంభమయ్యాయి. నవంబర్ 26 నాటికి, 14 రాష్ట్రాలు/యూటీలలోని 50 నగరాల్లో 5Gసేవలు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌టెల్, జియో 5జీ సేవలను అందిస్తున్నాయి. అలాగే బీఎస్‌ఎన్‌ఎల్‌లో త్వరలో 5జీ సర్వీస్ అందుబాటులోకి రానుందని సమాచారం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లైంగికంగా వేధిస్తున్నారా? కాలితో తన్నితే చాలు విద్యుత్ షాక్..!