Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

AIతో కష్టాలే.. రిషి సునక్‌తో ఎలెన్ మస్క్ భేటీ.. మానవుడి కంటే తెలివైనది!

Advertiesment
Elon Musk
, శుక్రవారం, 3 నవంబరు 2023 (21:46 IST)
Elon Musk
బ్రిటన్ ప్రధాని రిషి సునక్‌తో ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఏఐ ప్రమాదాల గురించి చర్చించారు. కృత్రిమ మేధస్సు- AIపై నిబంధనలను అవసరమని పిలుపునిచ్చారు. 
 
"నియంత్రణ నిరుత్సాహపరుస్తుంది, ఇది నిజం, కానీ నియంత్రణ మంచి విషయమని మేము సంవత్సరాలుగా నేర్చుకున్నామని నేను భావిస్తున్నాను." అని ఎలన్ మస్క్ అన్నారు. 
 
సమాచారాన్ని ప్రోత్సహించడానికి సాంకేతికత సామర్థ్యం అవసరమే. అయితే AI భవిష్యత్తు ప్రభావం గురించి పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు మస్క్ అన్నారు. సునాక్‌తో జరిగిన సమావేశంలో,  AIని చరిత్రలో అత్యంత విఘాతం కలిగించే శక్తి"గా అభివర్ణించారు.
 
ఏఐ"తెలివిగల మానవుడి కంటే తెలివైనది" అని మస్క్ తెలిపాడు. ఏఐ కారణంగా ఉద్యోగాలు అవసరం లేని స్థితి వస్తుంది. దీని వల్ల ప్రజలు సుఖంగా ఉంటారా లేదా అన్నది స్పష్టంగా తెలియరాలేదని మస్క్ వెల్లడించారు. 
 
ఇకపోతే, AI వల్ల కలిగే "విపత్తు" హాని గురించి హెచ్చరిస్తూ 28 దేశాలు సంతకం చేసిన ప్రకటనను మస్క్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. సంతకం చేసిన దేశాలలో చైనా కూడా చేరింది.
 
 శిఖరాగ్ర సమావేశానికి చైనాను ఆహ్వానించాలనే సునాక్ నిర్ణయం చాలా మంచిదని మస్క్ ప్రశంసించారు.
 
ఈ సంవత్సరం ప్రారంభంలో చైనా పర్యటనలో AI భద్రత గురించి చర్చించామని చెప్పారు. AI భద్రతలో పాల్గొనడానికి చైనా సిద్ధంగా ఉందని మస్క్ వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉర్పీ జావేద్ అరెస్ట్.. పొట్టి డ్రెస్సులతో రోడ్డుపైకి వచ్చిందట.. లేకుంటే?