Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డ్రోన్లను ఉపయోగించి పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్

drones
, శుక్రవారం, 12 మే 2023 (15:41 IST)
డ్రోన్లను ఉపయోగించి పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న ముగ్గురిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాక్ నుంచి డ్రగ్స్‌తో సంబంధం ఉన్న ముగ్గురు భారతీయులను ఢిల్లీ పోలీసుల కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ పట్టుకుంది. ఢిల్లీలోని సరాయ్ కాలే ఖాన్ నుంచి కౌంటర్ ఇంటెలిజెన్స్ యూనిట్ స్పెషల్ సెల్ వారిని అరెస్ట్ చేసింది. 
 
డ్రగ్స్ మాఫియా నుంచి పాకిస్థాన్‌కు హవాలా నెట్ వర్క్ ద్వారా బదిలీ అయిన డబ్బుకు బదులుగా నిందితులు పాకిస్థాన్ నుంచి డ్రోన్‌ల ద్వారా పంజాబ్, ఇతర రాష్ట్రాలలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. 
 
పంజాబ్ నుంచి పరారైన ఈ ముగ్గురు డ్రగ్స్ సరఫరాదారులకు అమెరికా, ఫిలిప్పీన్స్ సంబంధాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు. నిందితుల నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అస్సాంలో కారులో కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం - మరో నిర్భయ ఘటన