Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

డబ్బుల కట్టలు..ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చిన చైనా కంపెనీ

Advertiesment
China
, బుధవారం, 1 ఫిబ్రవరి 2023 (10:48 IST)
China
కరోనా సంక్షోభం, ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచంలోని ప్రముఖ టెక్నాలజీ కంపెనీలైన గూగుల్, ఫేస్‌బుక్, ట్విట్టర్, అమేజాన్, మైక్రోసాఫ్ట్ తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అలాగే వేతనాలను తగ్గిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు చెందిన ఓ కంపెనీ తన ఉద్యోగులకు కోట్లలో బోనస్, జీతాలు పెంచిన ఘటన పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
 
చైనాలోని హెనాన్ ప్రావిన్స్‌లో పనిచేస్తున్న హెనాన్ మైన్ అనే కంపెనీ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటిస్తోంది. క్రేన్లతో సహా భారీ వాహనాలను తయారు చేసే ఈ కంపెనీ.. భారత్ సహా పలు దేశాల్లో తమ ఉత్పత్తులను విక్రయిస్తోంది.
 
కరోనా సంక్షోభం కారణంగా చైనా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుండగా, హెనాన్ మైన్ ఆదాయం గత ఏడాదిలోనే 23 శాతం పెరిగింది. గతేడాది చివరి నాటికి కంపెనీ మొత్తం ఆదాయం 9.16 బిలియన్ యువాన్లు (దాదాపు రూ.11 వేల 86 కోట్లు). దీంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న కంపెనీ తమ ఉద్యోగులను తృప్తిపరిచేందుకు నిర్ణయించుకుంది.
 
ఈ కార్యక్రమంలో 61 మిలియన్ యువాన్ల (దాదాపు రూ. 73 కోట్ల 81 లక్షలు) విలువైన నగదు కట్టలను..  కంపెనీ వృద్ధికి బాగా పనిచేసిన వారికి అందజేసింది. ఇందులో 3 సేల్స్ మేనేజర్లకు 5 మిలియన్ యువాన్లు (దాదాపు రూ. 6 కోట్లు) బోనస్ అందించారు. మిగతా ఉద్యోగులందరికీ ఒక్కొక్కరికి 1 మిలియన్ యువాన్ (దాదాపు రూ. 1.20 కోట్లు) బహుకరించారు.
 
దీంతోపాటు ఈ కార్యక్రమంలో డబ్బుల లెక్కింపు పోటీ నిర్వహించి విజేతలకు గరిష్టంగా రూ.18 లక్షలు బహుమతిగా అందజేశారు. ఈ ఈవెంట్‌లో డబ్బు కుప్పలు తెప్పలుగా, ఇద్దరు ఉద్యోగులు చేతినిండా డబ్బులు తీసుకుని వెళ్తున్న ఫోటోలు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బొట్టు.. గోరింటాకు పెట్టుకుని వస్తే ఫైన్ : ప్రిన్సిపాల్ హెచ్చరిక