Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కిమ్ జాంగ్ ఉన్ ఇకలేరా? డ్రాగన్ కంట్రీ వైద్య బృందం ఏం చెప్పింది?

కిమ్ జాంగ్ ఉన్ ఇకలేరా? డ్రాగన్ కంట్రీ వైద్య బృందం ఏం చెప్పింది?
, సోమవారం, 27 ఏప్రియల్ 2020 (09:37 IST)
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ చనిపోయినట్టే తెలుస్తోంది. గుండెకు చేసిన ఆపరేషన్ వికటించడం వల్ల ఆయన మృతి చెందినట్టు వదంతులు వస్తున్నాయి. వీటిని ఉత్తర కొరియా ధృవీకరించడం లేదు. పైగా, సౌత్ కొరియా మాత్రం ఈ వార్తలు కొట్టిపారేస్తోంది. కిమ్ చనిపోలేదని, జీవించేవున్నట్టు తెలిపింది. కానీ, ఉత్తర కొరియా నమ్మినబంటు, మిత్రదేశమైన చైనా మాత్రం నోరు విప్పడం లేదు కదా, తమ దేశ వైద్య బృందాన్ని నార్త్ కొరియాకు పంపించింది. ఈ బృందం కిమ్‌ను పరీక్షించి, చనిపోయారనే సమాచారాన్ని చైనాకు చేరవేసినట్టు వినికిండి. కానీ, డ్రాగన్ కంట్రీ కూడా స్పష్టత ఇవ్వడం లేదు. 
 
కిమ్‌ అనారోగ్యానికి గురయ్యాక.. చైనా తమ దేశ వైద్య నిపుణుల బృందాన్ని ఉత్తర కొరియాకు పంపింది. ఆ బృందం కిమ్‌ను పరీక్షించినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి కిమ్ ఇకలేరన్న వార్త నిజమేననే వాదనలు చైనా నుంచి వినిపిస్తున్నాయి. జపాన్‌ మీడియా కూడా ఆయన చనిపోయారని చెబుతోంది. 
 
అదేసమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందంటూ వార్తలు ప్రసారం చేస్తోంది. ధూమపానం వల్ల, పరిపాలనాపరమైన ఒత్తిళ్ల వల్ల కిమ్‌ బరువు పెరిగారని, ఆయనకు కార్డియోవాస్క్యులర్‌ శస్త్రచికిత్స జరిగిందని చెబుతోంది. ఆ తర్వాత కిమ్‌ బ్రెయిన్‌డెడ్‌ బారిన పడ్డారనే వార్తలు కూడా ప్రసారమవుతున్నాయి. 
 
మరోవైపు, ఉత్తరకొరియాలో తిరుగుబాటుదారులు తమకు అందిన అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం కిమ్‌ చనిపోయారని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవల ఈ వార్తలను కొట్టిపారేశారు. దక్షిణ కొరియా కూడా కిమ్‌ చనిపోలేదని చెబుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

లాక్‌డౌన్ పొడగింపునకే సీఎం కేసీఆర్ మొగ్గు