Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉ.కొరియా అంటే డ్రాగన్‌కు భయం: భారత్‌లో రహదారులు మురికి కూపాలు: చైనా ఎద్దేవా

ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంతో ఉత్తర కొరియా అంటేనే దక్షిణ కొరియా, జపాన్‌తో పాటు చైనా సైతం జడుసుకుంటోంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియాపై జపాన్, దక

ఉ.కొరియా అంటే డ్రాగన్‌కు భయం: భారత్‌లో రహదారులు మురికి కూపాలు: చైనా ఎద్దేవా
, సోమవారం, 18 సెప్టెంబరు 2017 (17:26 IST)
ఉత్తర కొరియా ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణి ప్రయోగంతో ఉత్తర కొరియా అంటేనే దక్షిణ కొరియా, జపాన్‌తో పాటు చైనా సైతం జడుసుకుంటోంది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియాపై జపాన్, దక్షిణ కొరియా, చైనా ప్రజలు మండిపడుతున్నారు. ఇంకా భయపడుతున్నారని చైనా అధికా టీషేంగువా అన్నారు. ఉత్తర కొరియా పేరు వింటేనే తమ ప్రజలు జడుసుకుంటున్నారని టీషేంగువా వెల్లడించారు. 
 
ఉత్తర కొరియాతో స్నేహం కోరుకునేందుకు ప్రపంచ దేశాలు ముందుకొస్తున్నప్పటికీ.. ఆ దేశం చేస్తున్న అణు, క్షిపణి ప్రయోగాలతో విదేశాలను కలవరపాటుకు గురిచేస్తున్నట్లు ఆయన  పేర్కొన్నారు. కత్తి పట్టుకున్న ఉన్మాది ఎప్పటికైనా పొరుగువారిని గాయపరచకుండా ఊరుకోడని టీషేంగువా తెలిపారు. ఉత్తరకొరియా ఉన్మాదంతో ముందుకు సాగుతోందని.. అది జపాన్, దక్షిణ కొరియాతో పాటు చైనాకు కూడా ప్రమోదమేనని ఆయన వ్యాఖ్యానించారు.
 
మరోవైపు భారత్-జపాన్ సంబంధాలపై కూడా చైనా స్పందించింది. చైనా శత్రుదేశమైన జపాన్ భారత్‌ను మాయ చేస్తుందని చైనా అభిప్రాయం వ్యక్తం చేసింది.  జపాన్ అమెరికాను ప్రత్యక్ష్యంగా ఎదుర్కోలేక భారత్‌ను పావుగా వాడుకుంటుందని చైనా వెల్లడించింది. భారత ప్రధాన మంత్రి మోదీ, అబేలు ప్రస్తావించిన ఆసియా-ఆఫ్రికా గ్రోత్‌ కారిడార్‌ కాన్సెప్ట్‌ చైనాకు చెందిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ప్రాజెక్టు నుంచి తీసుకున్నదేనని చైనా మీడియా తేల్చేసింది. 
 
భారత్‌లో ఎన్ని ఎక్స్‌ప్రెస్‌వేలను, బుల్లెట్‌ ట్రైన్లను నిర్మించినా అక్క‌డి ర‌హ‌దారులు మురికి కూపాలను పోలి ఉంటాయని చైనా ఎద్దేవా చేసింది. జపాన్‌, భారత్‌లు వారి దేశాల అవసరాల ఆధారంగా సంబంధాలు మెరుగుపర్చుకుంటే ఉపయోగకరంగా ఉంటుందని హితవు పలికింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పవన్ కళ్యాణ్‌ను పట్టించుకోని ప్రధాని మోదీ... కటీఫ్....?