జమాతే ఇస్లామిక్ చీఫ్ మౌతరి రెహ్మాన్ నిజామినీ బంగ్లాదేశ్ ప్రభుత్వం ఉరితీసింది. 1971 యుద్ధ నేరాల కింద అతనికి ఈ శిక్ష విధించింది. ఈ శిక్షను ఢాకా జైల్లో అమలు చేసింది. ఇది ఆ దేశ విపక్ష పార్టీలకు గట్టి ఎదురుదెబ్బగా భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో బంగ్లాదేశలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
73 ఏళ్ల నిజామి బంగ్లాదేశ స్వాతంత్య్ర పోరాటం సమయంలో పాకిస్థాన్కు అనుకూలంగా వ్యవహరించినట్లు విచారణలో తేలడంతో పాటు... పాక్ దళాలకు సహకరించడంతోపాటు 480 మందిని చంపినట్లు తేలడంతో బంగ్లాదేశ్ న్యాయస్థానం ఆయనను దోషిగా తేల్చింది. దాంతో ప్రభుత్వం ఉరిశిక్ష అమలు చేసింది.
కాగా, బంగ్లాదేశ్ ప్రభుత్వం గత 2013 నుంచి ఇప్పటివరకు పలువురు విపక్ష నేతలను ఉరితీసింది. జమాతే ఇస్లామిక్ పార్టీకి చెందిన ముగ్గురు సినియర్లతోపాటు ప్రధాన ప్రతిపక్షం బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి చెందిన మరికొందరికి సైతం మరణ శిక్ష అమలు చేశారు.