Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీహార్‌లో మద్య నిషేధం.. ఎమ్మెల్సీ మనోరమాదేవి ఇంట్లో మద్యం.. అరెస్ట్ వారెంట్

Advertiesment
JD-U legislator Manorama Devi
, బుధవారం, 11 మే 2016 (17:22 IST)
బీహార్ రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమల్లో ఉన్న సమయంలో ఆ రాష్ట్ర అధికార జేడీయుకి చెందిన ఎమ్మెల్సీ మనోరమాదేవి ఇంట్లో భారీగా విదేశీ, స్వదేశీ మద్యం బాటిల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఆమెకు అరెస్ట్ వారెంట్ జారీ అయింది.
 
తాను ప్రయాణిస్తున్న కారును ఓవర్ టేక్ చేసినందుకు 19 యేళ్ల ఇంటర్ విద్యార్థిని ఎమ్మెల్సీ రమాదేవి కుమారుడు రాఖీ యాదవ్ తుపాకీతో కాల్చి చంపిన విషయంతెల్సిందే. ఇది దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో రాఖీని గయా పోలీసులు అరెస్టు చేశారు. అయితే, రాఖీ కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో ఎమ్మెల్సీ మనోరమాదేవి బాగోతాలు మరిన్ని బయటపడ్డాయి. ప్రస్తుతం ఆమె పరారీలో ఉన్నారు.
 
బీహార్‌లో మద్యపాన నిషేధం అమల్లో ఉంది. అయితే నిషేధాజ్ఞలను ఎమ్మెల్సీ మనోరమాదేవి అతిక్రమించారు. ఆమె ఇంట్లో భారీగా మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. ఆమె నివాసాన్ని సీజ్‌ చేశారు. ఈ సంఘటన పెను దుమారం రేపుతోంది. ఈ నేపథ్యంలో ఆమె అరెస్టుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే, జేడీయూ పార్టీ మనోరమాదేవిపై ఆరేళ్లపాటు సస్పెన్షన్ వేటు వేసింది కూడా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీనియర్ విద్యార్థుల దారుణం.. జూనియర్లను ఇనుప రాడ్లతో దాడి చేశారు!