Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బద్ధలైన లకి లకి అగ్నిపర్వతం - వెనక్కి వచ్చిన ఎయిరిండియా విమానం

Advertiesment
volcanic eruption

ఠాగూర్

, బుధవారం, 18 జూన్ 2025 (12:37 IST)
తూర్పు ఇండోనేషియాలోని లెవోటోబి లకి లకి అగ్నిపర్వతం బద్ధలైంది. దానికి సమీపంలోని బాలికి వెళ్లే ఎయిరిండియా విమానం వెనక్కి మళ్లింది. అక్కడి నుంచి తిరుగపయనమైన విమానం బుధవారం ఢిల్లీకి సురక్షితంగా చేరుకున్నట్టు అధికారులు పేర్కొన్నారు. దీంతో భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వచ్చే పలు అంతర్జాతీయ విమానాలను రద్దు చేసిననట్టు తెలిపారు. అగ్నిపర్వతం విస్ఫోటనం కారణంగా ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని
తూర్పు ఇండోనేషియాలోని సుసా టెంగారా ప్రావిన్స్‌లోని విమానాశ్రయాన్ని మూసివేసిట్టు వెల్లడించారు.
 
తూర్పు సుమా టెంగారా ప్రావిన్స్‌లోని లెవోటోబి లకి లకి పర్వతం మంగళవారం విస్ఫోటనం చెందడంతో దాదాపు 11 కిలోమీటర్ల ఎత్తులో బూడిద ఎగిసిపడినట్టు వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ అధికారులు వెల్లడించారు. బుధవారం ఉదయం అగ్నిపర్వతంలో మళ్లీ విస్ఫోటనం సంభవించడంతో ఒక కిమీట ఎత్తులో దట్టమైన బూడిద ఎగిసిపడుతున్నట్టు తెలిపారు. 
 
ఈ విస్ఫోటనం కారణంగా అగ్నిపర్వతం సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు స్థానిక విపత్తు నిర్వహణ సంస్థ అధికారి అవీ హల్లన్ తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు ధరించాలని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చివరిసారిగా ఈ యేడాది మేలో లకిలకి పర్వతం పలుమార్లు బద్దలైన విషయం తెల్సిందే. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కుప్పం మహిళతో ఫోన్‌లో మాట్లాడిన చంద్రబాబు: ఇంకా రూ.5లక్షల ఆర్థిక సాయం