Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం.. 36మంది మృతి.. 72మందికి తీవ్రగాయాలు

Advertiesment
Taiwan train
, శుక్రవారం, 2 ఏప్రియల్ 2021 (10:49 IST)
Taiwan
తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. సొరంగ మార్గం గుండా వెళ్తున్న రైలు పట్టాలు తప్పి సొరంగా మార్గాన్ని ఢీకొంది. దీంతో చాలా మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ ఘోర ప్రమాదం తేవాన్‌లో చోటు చేసుకుంది. శుక్రవారం తెల్లవారుజామున రైలు పట్టాలు తప్పి సొరంగ మార్గాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 36 మంది వరకు మృతి చెందినట్లు తెలుస్తోంది. 
 
అలాగే 72 వరకు గాయపడినట్లు రవాణా మంత్రిత్వశాఖ తెలిపింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు హుటాహుటిన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కొందరు రైలులో చిక్కుకోవడంతో వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. కాగా, గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ఈ రైలులో 350 వరకు ఉన్నారు. ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, రెస్య్కూ టీమ్‌ సిబ్బంది చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ప్రమాదంలో రైలు బోగీలు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
 
అయితే మృతుల సంఖ్య 36కు పైగా ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే రైల్లో పెద్ద ఎత్తున రోధనలతో మిన్నంటాయి. ప్రమాదం నుంచి రక్షించాలంటూ ప్రయాణికులు కేకలు వేశారు. కొందరు రైల్లో చిక్కుకోవడంతో వారిని బయటకు తీయడం అధికారులకు కష్టంగా మారింది. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఈ కూరగాయ కిలో ఎంతో తెలుసా? లక్ష రూపాయలు..! #hopshoots అంటే?