Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికాలో ఇళ్ల మధ్యలో కూలిన విమానం- ఇద్దరు మృతి

అమెరికాలో ఇళ్ల మధ్యలో కూలిన విమానం- ఇద్దరు మృతి
, మంగళవారం, 12 అక్టోబరు 2021 (11:18 IST)
plane crash
అమెరికాలో ఇళ్ల మధ్యలో విమానం కూలిన ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కాలిఫోర్నియా ప‌ట్ట‌ణంలోని శాన్‌డియాగో శివారులోని శాంటీ ప్రాంతంలో సోమ‌వారం మ‌ధ్యాహ్నం ఇళ్ల‌పై చిన్న విమానం కూలింది. ఈ ఘ‌ట‌న‌లో రెండు ఇళ్లతో పాటు ప‌లు వాహ‌నాలు ధ్వంసం కాగా.. రెండు మృత‌దేహాలను అగ్నిమాప‌క సిబ్బంది క‌నుగొన్న‌ట్లు అధికారులు వెల్ల‌డించారు. మ‌రొ ఇద్ద‌రు గాయ‌ప‌డిన‌ట్లు తెలిపారు. 
 
మ‌ర‌ణించిన వారిని పైలట్, యూపీఎస్ డ్రైవర్ గా గుర్తించారు. ఫాక్స్ 5 శాన్ డియాగో ట్విన్ ఇంజిన్ సెస్నా 340 విమానం అరిజోనాలోని యుమా నుంచి బయలుదేరింది. గాల్లోకి ఎగిరిన కాసేప‌టికే ఆ విమానం శాంటీ ప్రాంతంలో కూలింది. ఆ స‌మ‌యంలో భారీగా మంట‌లు చెల‌రేగా.. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే అక్క‌డ‌కు చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు. 
 
అయితే.. అప్ప‌టికే విమానంతో పాటు ప‌లు వాహ‌నాలు పూర్తిగా ద‌గ్థం అయ్యాయి. కాగా.. విమానం కూలిపోతున్న‌ప్పుడు చూసిన ప్ర‌జ‌లు ఇళ్లలోంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. విమానం కుప్ప‌కూలిన స‌మ‌యంలో ఆ విమానంలో ఎంత మంది ప్ర‌యాణీకులు ఉన్నారు అనే వివ‌రాలు ఇంకా తెలియాల్సి ఉంది

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అలిపిరి నుంచి తిరుమల వరకు నడకదారి ప్రారంభించిన సీఎం జ‌గ‌న్