Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శనీశ్వరుడి ప్రభావం.. 11 తుఫాన్లు.. భారీ వర్షాలు.. సునామీ?

సముద్ర భూగర్భంలో ప్రకంపనలు ఏర్పడే అవకాశాలుండటంతో భారత్, జపాన్, మలేషియాల్లో సముద్రంలో అలజడి ఏర్పడుతుందని.. తద్వారా సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. డిసెంబర్ 19కి తర్వాత శనిగ్

శనీశ్వరుడి ప్రభావం.. 11 తుఫాన్లు.. భారీ వర్షాలు.. సునామీ?
, సోమవారం, 18 డిశెంబరు 2017 (11:37 IST)
సముద్ర భూగర్భంలో ప్రకంపనలు ఏర్పడే అవకాశాలుండటంతో భారత్, జపాన్, మలేషియాల్లో సముద్రంలో అలజడి ఏర్పడుతుందని.. తద్వారా సునామీ వచ్చే అవకాశం ఉన్నట్లు జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. డిసెంబర్ 19కి తర్వాత శనిగ్రహం వృశ్చిక రాశి నుంచి ధనుస్సుకు తన స్థానాన్ని మార్చుకుంటున్నాడు.

వృశ్చికం నీటికి సంబంధించిన రాశి. ధనస్సు అగ్నికి సంబంధించిన రాశి. నీటి నుంచి శనీశ్వరుడు అగ్ని రాశికి మారడంతో ప్రకృతీ వైపరీత్యాలు సంభవించే ప్రమాదం వుంది. అంతేగాకుండా కేతు ప్రభావం, శనీశ్వరుడి ప్రభావంతో సముద్రంలో ప్రకంపనలు ఏర్పడే అవకాశం ఉంది. తద్వారా సునామీ ఏర్పడే ఛాన్సుందని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. 
 
ఇండోనేషియా, జపాన్, భారత్, నేపాల్, మలేషియా, సింగపూర్, శ్రీలంక, ఐరోపా దేశాల్లో అగ్నితో ప్రమాదాలు ఏర్పడుతాయని, అగ్నిపర్వతం పేలే ఛాన్సులు లేకపోలేదని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అయితే దీని తీవ్రత మాత్రం పెద్దగా వుండకపోవచ్చునని వారు చెప్తున్నారు. 

అమెరికా, రష్యా, పాకిస్థాన్, ఆప్ఘనిస్థాన్, ఇరాన్, ఇరాక్, ఇండోనేషియా దేశాల్లో భూమి కంపిస్తుంది. తద్వారా ప్రాణనష్టం వుంటుంది. 11 తుఫాన్లు ఏర్పడుతాయి. ఐదు తుఫాన్లు బలహీనమవుతాయి. కానీ ఆరు తుఫాన్ల ప్రభావంతో భారీ వర్షాలుంటాయని పంచాంగం చెప్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుజరాత్ సీఎం విజయ రూపానీ విజయం