Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టెక్సాస్‌లో ఆగంతకుడి కాల్పులు.. ఐదుగురు మృతి..

టెక్సాస్‌లో ఆగంతకుడి కాల్పులు.. ఐదుగురు మృతి..
, ఆదివారం, 1 సెప్టెంబరు 2019 (12:24 IST)
టెక్సాస్: అమెరికాలో టెక్సాస్‌లో సాయుధుడైన ఒక ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, మరో 21 మంది గాయపడ్డారు. టెక్సాస్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కాల్పులకు పాల్పడిన ఆగంతకుడు బైక్‌పై వచ్చాడు. 
 
అమెరికా పోస్టల్ విభాగానికి చెందిన ఒక టక్కును హైజాక్ చేసి, అక్కడున్న జనాలపై తుపాకీతో కాల్పులు జరిపాడు. 
ఆ ఆగంతకుడు టెక్సాస్‌కు చెందిన ఓడెసా, మిడ్‌ల్యాండ్ పట్టణాల సమీపంలో వాహనాన్ని నడిపాడు. 
 
ఈ నేపధ్యంలో పోలీసులు అక్కడున్న ప్రజలను అప్రమత్తం చేశారు. వారు రోడ్లపైకి రాకుండా నియంత్రిస్తూ, ఆ ఆగంతకుడిని పట్టుకునే ప్రయత్నం చేశారు. తరువాత అతనినిపై కాల్పులు జరిపి మట్టుబెట్టారు.

కాగా ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు న్యాయశాఖాధికారులు కూడా గాయపడ్డారు. మిడ్‌ల్యాండ్ లోని సినర్జీ‌లో గల ఒక సినిమా థియేటర్ సమీపంలో పోలీసులు ఆ ఆగంతకుడిపై కాల్పులు జరిపి అంతమొందించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా బండారు.. తమిళిసై నియామకంపై అసలు రహస్యం..?