Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ విద్యార్థికి అమెరికాలో జైలు శిక్ష, 14 లక్షల జరిమానా

ఏపీ విద్యార్థికి అమెరికాలో జైలు శిక్ష, 14 లక్షల జరిమానా
, గురువారం, 15 ఆగస్టు 2019 (12:23 IST)
అమెరికాలో ఉన్నత విద్య చదువుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థికి ఏడాది జైలు శిక్ష, 14 లక్షల జరిమానా విధించింది అక్కడి స్థానిక కోర్టు. దాదాపు 66 కంప్యూటర్లు పాడు చేయడమే అతడు చేసిన నేరం. చిత్తూరు జిల్లాకు చెందిన ఆకుతోట విశ్వనాథ్ అనే స్టూడెంట్ వీసాపై అమెరికా వెళ్లాడు. అక్కడ న్యూయార్క్‌లోని ఓ యూనివర్శిటీలో ఎంఎస్ చదువుతున్నాడు. అయితే కావాలనే 66 కంప్యూటర్లలో యూఎస్బీ కిల్లర్ డివైజ్‌ని ఇన్సర్ట్ చేశాడు.
 
ఈ డివైజ్‌ని కంప్యూటర్‌లోని యూఎస్బీ పోర్టులో చేర్చినప్పుడు కంప్యూటర్‌లోని ఆన్‌బోర్డ్ కెపాసిటర్లు వేగంగా ఛార్జ్ అయ్యేలా చేస్తుంది. దాంతో పాటు పదే పదే డిశ్చార్జ్ అయ్యేలా ఒక అలర్టును పంపుతుంది. దీంతో యూఎస్బీ పోర్టు, ఎలక్ట్రికల్ సిస్టమ్ ఓవర్ లోడ్ అయ్యి అవి పాడవుతాయి. విశ్వనాథ్ ఫిబ్రవరి 14వ తేదీన ఇలా చేశాడు. దీంతో కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిబ్రవరి 22వ తేదీన విశ్వనాథ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా… ఏడాది పాటు జైలు శిక్ష, 14 లక్షల జరిమానా విధించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశాభివృద్ధికి ప్రతి ఒక్కరూ దోహదపడాలి : తమ్మినేని సీతారామ్