Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అవన్నీ అవాస్తవాలు, మేం పాకిస్తాన్‌కు ఆయుధాలు పంపలేదు: టర్కీ

Advertiesment
India vs Pakistan

ఐవీఆర్

, బుధవారం, 30 ఏప్రియల్ 2025 (14:05 IST)
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో భారతదేశం- పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపధ్యంలో టర్కీ పాకిస్తాన్‌కు ఆయుధాలు, మందుగుండు సామగ్రిని సరఫరా చేస్తోందని పేర్కొంటూ వార్తలు వచ్చాయి. సైనిక సామగ్రిని అందించడానికి టర్కిష్ C-130E హెర్క్యులస్ కరాచీలో దిగిందని ఆ నివేదికలు తెలిపాయి. ఈ వార్త కాస్తా వైరల్ అయ్యింది. అంతేకాదు... సుమారు ఆరు C-130E విమానాలు పాకిస్తాన్‌లో దిగాయని కూడా పేర్కొన్నాయి.
 
అయితే ఈ వార్తలను టర్కీ తోసిపుచ్చింది. అవన్నీ ఉత్తమాటలేననీ, తమ దేశం టర్కీ నుండి ఒక కార్గో విమానం ఇంధనం నింపేందుకు మాత్రమే పాకిస్తాన్‌లో దిగిందని ప్రెసిడెన్సీ డైరెక్టరేట్ ఆఫ్ కమ్యూనికేషన్స్ చెప్పిందని ఓ వార్తా సంస్థ వెల్లడించింది. ‘టర్కియే పాకిస్తాన్‌కు ఆయుధాలతో నిండిన ఆరు విమానాలను పంపుతున్నట్లు’ కొన్ని మీడియా సంస్థలలో వ్యాపించే వాదనలు నిజం కాదని టర్కిష్ అధికారులు సోషల్ మీడియాలో ఒక పోస్ట్‌లో తెలిపారు.
 
కాగా 2023లో టర్కీలో భారీ భూకంపం సంభవించింది. ఆ సమయంలో భారతదేసం టర్కీకి ఆపన్నహస్తం అందించింది. సాయం అందించిన చేతులకు హాని ఎలా తలపెడతాము అంటూ పేరు చెప్పేందుకు నిరాకరించిన ఓ టర్కీ అధికారి వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

BSNL: బీఎస్ఎన్ఎల్‌ సూపర్ ప్లాన్.. రూ.126లకే అపరిమిత కాల్స్