Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆధార్‌తో సమాచారం దుర్వినియోగం కావట్లేదు : బిల్‌గేట్స్‌

భారత్‌లో గుర్తింపు కార్డుగా చెలామణీ అవుతున్న ఆధార్‌తో ఎలాంటి వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కావడం లేదని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాప

ఆధార్‌తో సమాచారం దుర్వినియోగం కావట్లేదు : బిల్‌గేట్స్‌
, శుక్రవారం, 4 మే 2018 (09:39 IST)
భారత్‌లో గుర్తింపు కార్డుగా చెలామణీ అవుతున్న ఆధార్‌తో ఎలాంటి వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కావడం లేదని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్‌ నీలేకని ఇలాంటి వ్యవస్థను ఇతర దేశాల్లో అనుసరించడానికి అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారన్నారు.
 
భారత్‌లో గుర్తింపు కార్డుగా చెలామణీ అవుతున్న ఆధార్ ఇతర దేశాలకు అనుసరణీయమైనదేనా అని మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన అవును అనే సమాధానమిచ్చారు. అంతేకాకుండా, ఆధార్‌తో ఎలాంటి సమాచార దుర్వినియోగ సమస్యా లేదని, అలాంటి వ్యవస్థను ఇతర దేశాల్లో అమలు చేసే విధంగా ప్రపంచ బ్యాంకుకు బిల్ అండ్‌ మిలిందా గేట్స్ నిధులు సమకూర్చిందని మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌ గేట్స్‌ ఓ కార్యక్రమంలో పేర్కొన్నారు. ఆధార్‌పై బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ.. 
 
'ఆధార్‌ కార్డు వల్ల అందే ప్రయోజనాలు చాలా ఉన్నాయన్నారు. మిగతా దేశాలు ఈ విధానాన్ని అందిపుచ్చుకోవాలి. దీనివల్ల దేశ ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందడంతో పాటు ప్రజలు సాధికారతకు ఎంతో తోడ్పడుతుంది. దాని కోసమే ప్రపంచ బ్యాంకుకు నిధులు అందించాం. ఆధార్‌తో ఎటువంటి సమాచార చోరి సమస్యలు ఉండవన్నారు. ఆధార్ అనేది కేవలం ఐడీ వెరిఫికేషన్ స్కీమ్‌ మాత్రమే అని వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డేనియల్స్‌తో ట్రంప్ శారీరక సంబంధాలు నిజమే: న్యూయార్క్ మాజీ మేయర్