Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్ ఆర్మీ చావుదెబ్బ తీస్తోంది.. ఏడుగురు సైనికులను కోల్పోయాం.. పాకిస్థాన్

యురీ ఉగ్రదాడుల తర్వాత భారత్ తమను చావుదెబ్బ కొడుతోందని పాకిస్థాన్ వాపోతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత ఆర్మీ ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది, పదుల సంఖ్యల ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్లను చంపేసి

భారత్ ఆర్మీ చావుదెబ్బ తీస్తోంది.. ఏడుగురు సైనికులను కోల్పోయాం.. పాకిస్థాన్
, సోమవారం, 14 నవంబరు 2016 (15:14 IST)
యురీ ఉగ్రదాడుల తర్వాత భారత్ తమను చావుదెబ్బ కొడుతోందని పాకిస్థాన్ వాపోతోంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోకి భారత ఆర్మీ ప్రవేశించి సర్జికల్ స్ట్రైక్స్ జరిపింది, పదుల సంఖ్యల ఉగ్రవాదులు, ఆర్మీ జవాన్లను చంపేసిందని గుర్తు చేస్తోంది.
 
తాజాగా ఏడుగురు సైనికులను కోల్పోయినట్టు పాకిస్థాన్ ప్రకటించింది. భారత బలగాల కాల్పుల్లో తమ దేశానికి చెందిన ఏడుగురు సైనికులు హతమయ్యారని తెలిపింది. అయితే దీన్ని భారత ఆర్మీ ఇంకా ధృవీకరించలేదు. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని బీంబెర్ సెక్టార్‌లో భారత ఆర్మీ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడిందని పాకిస్థాన్ ఆరోపించింది. 
 
కాగా, పీవోకేలో ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు సర్జికల్ దాడులు జరిపినప్పటి నుంచీ పాక్ బలగాలు యధేచ్చగా కాల్పుల విరమణ ఒఫ్పందానికి తూట్లు పొడుస్తూ వందల సార్లు కాల్పులకు తెగబడిన విషయం తెల్సిందే. ఈ కాల్పులను తిప్పికొడుతూ అనేక మంది భారత సైనికులు ఇటీవలి కాలంలో అమరులయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నొప్పి పుడుతుందని ఆపరేషన్ ఆపేస్తామా.. ఇదీ అంతే.... నాడు స్ట్రాంగ్ చాయ్ అడిగారు.. : నరేంద్ర మోడీ