కావలసిన పదార్థాలు :
బియ్యం : పిడికెడు
రాగి పిండి : ఒక కప్పు
నీళ్ళు : 4 కప్పులు
ఉప్పు : 1/4 స్పూన్
తయారీ విధానం :
మొదట బియ్యం ఒక పాత్రలో వేసి శుభ్రం చేసి నీళ్ళు, ఉప్పు కలిపి ఉడికించాలి. బియ్యం మెత్తగా ఉడికిన తరువాత అందులో రాగిపిండి వేసి, మూత పెట్టి మరోమారు కొద్ది సేపు ఉడికించారు. తర్వాత గరిటతో కాని, పప్పు గుత్తితో కాని మెత్తగా ఉండలు లేకుండా మెదపాలి. ష్టౌ మంటను తగ్గించి మళ్ళీ గట్టిపడేవరకు నిదానంగా ఉడికించి దించుకోవాలి. అంతే రాగి సంకటి రెడీ. కాస్త చల్లారిన తర్వాత తడిచేతితో ముద్దలుగా చేసుకుని నాటుకోడి ఇగురు లేదా బచ్చలి కాంబినేషన్తో తింటే... చాలా బాగుంటుంది.