కావలసిన పదార్థాలు :
పుదీనా... ఒక కట్ట
బియ్యం... అరకేజీ
ఉల్లిపాయలు... ఒకటి
పచ్చిమిర్చి... నాలుగు
అల్లం, వెల్లుల్లి ముద్ద... రెండు టీస్పూన్లు
షాజీరా... అర టీస్పూన్
దాల్చిన చెక్క... చిన్న ముక్క
నెయ్యి... 50 గ్రాములు
పంచదార... మూడు టీస్పూన్లు
ఉప్పు... సరిపడా
నీరు... తగినంత
తయారీ విధానం :
ఒక గిన్నె వేడిచేసి అందులో పంచదార వేసి కరిగించాలి. తరువాత దాన్ని వేడిచేయాలి. ఇలా తయారైన దాన్నే బ్రౌన్ కెరామిల్ అంటారు. అందులోనే నెయ్యి, ఉల్లిపాయ ముక్కలు, సగం పుదీనా వేసి ఎర్రగా వేయించాలి.
తరువాత పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముద్ద, షాజీరా, దాల్చిన చెక్క వేసి వేయించాలి. తరువాత ఓ లీటరు నీరు పోసి మరిగించాలి. ఎసరు మరుగుతుండగానే, కడిగిన బియ్యం, సరిపడా ఉప్పు వేసి మూతపెట్టి సన్నటి మంటమీద ఉడికించాలి. అన్నం బాగా ఉడికి తరువాత మిగిలిన సగం పుదీనాను పైన చల్లి వేడి వేడిగా వడ్డించాలి. అంతే పుదీనా బ్రౌన్ రైస్ రెడీ అయినట్లే...!