కావలసిన పదార్థాలు :
పనీర్ - పావు కిలో, టమోటాలు - అరకిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ - టీస్పూన్, పచ్చిమిర్చి - రెండు, వెన్న - స్పూన్, టమోటా కెచప్ - రెండు స్పూన్లు, ఉప్పు - తగినంత, చక్కెర - అరటీస్పూన్.
తయారు చేసే విధానం :
ముందుగా టమోటాలను వేయించి తోలు తీసి పెట్టుకోవాలి. దీనిలో సన్నగా తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి కలపాలి. తర్వాత టమోటా కెచప్, ఉప్పు, వెన్న, పంచదారలను వేసి కలిపి స్టవ్ మీద పెట్టి ఉడికించి దించాలి.
తర్వాత పనీర్ను చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. బాణాలిలో నూనె వేసి కాగాక పనీర్ ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేంత వరకు వేయించాలి. వీటిని టమోటా మిశ్రమంలో వేసి ముంచాలి. పనీర్ కుర్మాను వేడివేడిగా పరోటాతో సర్వ్ చేయాలి.