కావలసిన పదార్థాలు :
మైదా... 1 కిలో
ఈస్ట్... 10 గ్రాములు
పంచదార... 20 గ్రాములు
సోంపు... 20 గ్రాములు
ఉప్పు... సరిపడా
పాలు... 2 కప్పులు
నెయ్యి... 100 గ్రాములు
తయారీ విధానం :
మైదాపిండి జల్లించి ఉంచుకొని, ఒక పాత్రలో ఈస్ట్, పంచదార, కొంచెం నీళ్ళు పోసి బాగా కలిపి పది నిమిషాలు ఉంచుకోవాలి. మైదాపిండిలో ఈ మిశ్రమంతో పాటుగా, పాలు, ఉప్పు, సోంపు వేసి బాగా మెత్తగా పూరీ ముద్దలాగా చేసుకోవాలి. ఈ ముద్దను 20 నిమిషాలపాటు నానబెట్టాలి.
ఇలా చేయడంవల్ల ముద్దలో కలిసిన ఈస్ట్ వల్ల పిండి బాగా ఉబ్బుతుంది. తరువాత మళ్ళీ ఈ పిండిని బాగా కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి చపాతీల్లాగా చేయాలి. పెనం వేడి చేసి వీటిని వేసి రెండువైపులా కాల్చి నెయ్యి రాసి వేడి వేడిగా తింటే చాలా రుచిగా వుంటాయి.