Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కార్గిల్ యుద్ధ వీరుడు నచికేత, ఆకాశంలో మిగ్ మండుతున్నా పాక్ సైనికులను వణికించాడు...

కార్గిల్ యుద్ధ వీరుడు నచికేత, ఆకాశంలో మిగ్ మండుతున్నా పాక్ సైనికులను వణికించాడు...
, శుక్రవారం, 24 జులై 2020 (15:13 IST)
కార్గిల్ యుద్ధ సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నచికేత ఫ్లైట్ లెఫ్టినెంట్ మిగ్ -27 పైలట్ తన విమానంతో పాకిస్తాన్ పైన యుద్ధానికి విమానంతో గాల్లోకి లేచాడు. అతను 26 మే 1999న బటాలిక్ సెక్టార్‌లో యుద్ధంలో పాల్గొన్నాడు. 80 ఎంఎం రాకెట్లు మరియు విమానం యొక్క 30 ఎంఎం ఫిరంగిలతో నచికేత శత్రు స్థావరాలపై దాడి చేశాడు.
 
ఈ ఆపరేషన్ చేస్తున్న సమయంలో తను నడుపుతున్న మిగ్ విమానంలోని ఇంజిన్లో మంటలు చెలరేగాయి. వాటిని అదుపులోకి తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో నచికేత బయకు దూకేశాడు. 
 
పాకిస్తాన్ భూభాగంలో ల్యాండ్ అయిన వెంటనే పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఐతే పాక్ సైనికులను రెండు గంటలపాటు ముప్పుతిప్పలు పెట్టాడు. పాక్ సైనికులపై తన పిస్టల్ తో కాల్పులు కొనసాగించాడు. ఐతే అతడిని పాకిస్తాన్ సైన్యం పెట్రోలింగ్ అతన్ని పట్టుకుంది. అతడిని రావల్పిండిలోని జైలుకు తీసుకెళ్లారు, అక్కడ ఒక సీనియర్ అధికారి జోక్యం చేసుకునే వరకు పాకిస్తాన్ సైనికులు అతడిని విచక్షణరహితంగా కొట్టారు. ఆ దెబ్బలకు నచికేత వెన్నుకి తీవ్ర గాయాలయ్యాయి.
 
నచికేత ఎనిమిది రోజులు పాకిస్తాన్ దళాల అదుపులో ఉన్నాడు. అతన్ని మొదట బటాలిక్‌లో తెలియని ప్రదేశానికి తీసుకెళ్లారు. రెండు గంటల తరువాత అతన్ని హెలికాప్టర్ ద్వారా స్కర్దుకు తీసుకువెళ్లారు. అతన్ని పాకిస్తాన్ వైమానిక దళం ఆపరేషన్స్ డైరెక్టర్, గ్రూప్ కెప్టెన్ కైజర్ తుఫైల్ విచారించారు. ఈ విచారణను "సాధారణమైన సివిల్" అని తుఫైల్ చెప్పారు. ఇది క్యాప్టర్ మరియు పిఒడబ్ల్యూ కాకుండా ఇద్దరు అధికారుల మధ్య జరిగిన సాధారణ చర్చ అని అన్నారు.
 
నచికేతను జూన్ 3, 1999న స్వదేశానికి రప్పించారు. పాకిస్తాన్ లోని అంతర్జాతీయ రెడ్‌క్రాస్ కమిటీకి ఆయనను అప్పగించారు. తరువాత అమృత్‌సర్-టు-లాహోర్ రహదారిపై అటారీ వద్ద ఉన్న భారత సరిహద్దు చెక్ పోస్ట్‌ దగ్గర నుంచి ఆయన స్వదేశం భారత్ చేరుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనది రాచరిక వ్యవస్థ కాదు.. సీఎం జగన్మోహన్ రెడ్డిగారూ : వైకాపా ఎంపీ