తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని పలువురు ప్రముఖులు బుధవారం దర్శించుకున్నారు. వీరిలో తమిళ సినీ యువనటుడు జీవ, జమ్మూ కాశ్మీర్ డిఐజి గుప్తా తదితరులు తమ కుటుంబ సభ్యులతో కలసి ఉదయం నైవేద్య విరామ దర్శన సమయంలో దర్శించుకున్నారు. వీరిరువురికి ఆలయంలో టిటిడి అధికారులు దర్శనం ఏర్పాటు చేసి తీర్ద ప్రసాదాలు అందచేశారు.