Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తిరుమల చేరుతున్న భక్త జనసందోహం

Advertiesment
Vaikunta Ekadasi
, బుధవారం, 31 డిశెంబరు 2014 (14:28 IST)
వైకుంఠ ఏకాదశి నాడు కలియుగ దైవం కొలువున్న వేంకటనాథుని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకుంటే నిజంగానే వైకుంఠానికి వెళ్ళినంత పుణ్యం దక్కుతుందని హిందువులు నమ్ముతారు. ఆ నమ్మకం ఎంతో బలమైనది. రాకెట్ వేగంతో మానవుడు ముందుకు దూసుకుపోతున్నా.. ఆ రాకెట్ ను ప్రయోగాన్ని విజయవంతం చేయమని వెంకన్న స్వామిని కోరుకునేంత నమ్మకం. 
 
అందుకే పండితులు, పామరులు అనే తేడా లేకుండా వైకుంఠ ఏకాదశి నాడు తిరుమల కిటకిటలాడుతుంది. పైగా ఏడాది ఆరంభం కూడా కావడంతో జనం తిరుమల బాట పడుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, న్యాయమూర్తులు ఇలా ఒకరేంటి ప్రభుత్వ సారధలందరూ తిరుమలకు క్యూ కడుతున్నారు. 
 
వీరి సంగతి ఇలా ఉంటే ఇప్పటికే సామాన్య భక్తులు తిరుమల చేరుకుని క్యూ కాంపెక్సులోకి చేరేందుకు సన్నద్దమయిపోయారు. వారిని మధ్యాహ్నాం 12 గంటల నుంచి లోని అనుమతించడంతో టిబిసి ప్రాంతమంతా జనసంద్రంగా మారిపోయింది. ద్వారాల వద్ద తొపులాటలు జరుగుతున్నాయి. రోడ్లపై జనమే జనం కనిపిస్తున్నారు. వీరందరూ ఇప్పుడు క్యూలైన్లోకి అడుగిడితే వీరికి గురువారం ఉదయం 5 గంటల నుంచి దర్శన భాగ్యం లభిస్తుంది. 
 
వాస్తవానికి 1.45 గంటల నుంచే దర్శనం ఉన్నప్పటికీ ఆ సమయమంతా కైంకర్యాలకు, విఐపీలకు సరిపోతుంది. తరువాత సామాన్య భక్తులకు సాయంత్రం వరకూ దర్శన భాగ్యం కలుగుతుంది. ఏకాదశి నాడు వైకుంఠ ద్వార ప్రవేశం ఉండడంతో రోజుల తరబడి అయినా సరే క్యూలైన్లలో వేచి ఉండడానికి భక్తులు సిద్ధపడిపోయారు. 

Share this Story:

Follow Webdunia telugu