Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శనివారం నవంబర్ 18న ఆ ఒక్క పనిచేస్తే యేలినాటి శని వదిలిపోతుంది...

కార్తీక మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి పరమేశ్వరుడికి పూజ చేసి దీపాలు వెలిగిస్తే ఎంత మంచి జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేకంగా పూజలు చేయడం వ

Advertiesment
Shani‬
, శుక్రవారం, 17 నవంబరు 2017 (13:42 IST)
కార్తీక మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే తలస్నానం చేసి పరమేశ్వరుడికి పూజ చేసి దీపాలు వెలిగిస్తే ఎంత మంచి జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే కార్తీక పౌర్ణమి నాడు ప్రత్యేకంగా పూజలు చేయడం వల్ల కూడా జన్మలో చేసిన పాపాలు తొలగిపోతాయి. అదే కార్తీక సోమవారం నాడు సూర్యోదయానికి ముందు తలస్నానం చేసి దీపాలు వెలిగించి ఉపవాసం వుంటే తనువు చాలించాక నేరుగా కైలాసానికి వెళతారన్నది విశ్వాసం. కార్తీక మాసంలో దానం చేయడం చాలా మంచిది. ఆకలిగా ఉన్నవారికి ఆహారం పెట్టడం కూడా చాలా గొప్పది.
 
నవంబర్ 18 అమావాస్య రోజుతో కార్తీక మాసం ముగుస్తుంది. కార్తీక మాసం చివరి రోజైన అమావాస్య నాడు చేసే దానం కార్తీక మాసం నెలరోజుల కన్నా ఎక్కువ పుణ్యం వస్తుంది. కాబట్టి ఆ రోజు దానం చేస్తే చాలా మంచిది. నవంబర్ 18న సూర్యోదయానికి ముందే కార్తీక స్నానం చేసి శివాలయానికి వెళ్లి అభిషేకం చేసి భిక్షగాళ్ళకు రాగి వస్తువులను దానం చేయాలి. ఇలా రాగి వస్తువులను దానం చేస్తే ఆ ఒక్కరోజే చాలా పుణ్యం వస్తుందని పండితులు చెపుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శ్రీవారి దర్శనానికి టైమ్‌స్లాట్.. ఇక హాయిగా చూసిరావొచ్చు...