Publish Date: Fri, 06 Mar 2015 (10:07 IST)
Updated Date: Fri, 06 Mar 2015 (10:09 IST)
తిరుమలలో గురువారం భక్తుల రద్దీ తక్కువగా ఉంది. తిరుమలలో గురువారం ఉదయం 3 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకూ51,937 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఉచిత దర్శనం కోసం భక్తులు వేచి ఉండే రెండో వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కంపార్టుమెంట్లు 3 నిండాయి. వారికి నాలుగు గంటల సమయం పడుతోంది. ఇక నడకదారిన వచ్చే భక్తులు ఒక్క కంపార్టుమెంటులో ఉన్నారు.
వారు స్వామివారిని దర్శించుకోవడానికి రెండు గంటల సమయం పడుతుంది. ఇదిలా ఉండగా శుక్రవారం మధ్యాహ్నం నుంచి రద్దీ కాస్త పెరిగే అవకాశం ఉంది. వారాంతం కావడంతో చెన్నయ్, బెంగళూరు నుంచి వచ్చే భక్తుల సంఖ్య పెరుగనున్నది. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంపైన ప్రత్యేక దర్శనం ప్రారంభం కానున్నది.