మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడనివాస్ ఆదివారం సాయంత్రం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఆయన 60 అడుగుల దూరం నుంచి సామాన్యుడిలా దర్శనం చేసుకోవడం విశేషం.
నెల్లూరులో సంక్రాంతి సంబరాలలో పాల్గొని తిరుమల చేరుకున్న ఆయనకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఓ సామాన్యుడిలా వైకుంఠం క్యూ నుంచి ఆలయంలోకి ప్రవేశించిన ఆయన దర్శనం కూడా సామాన్యుడిలాగే చేసుకోవడం విశేషం. ఆయనతో పాటు బిజేపీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి తదితరులు ఉన్నారు.