Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మీలోని సేవా శక్తిని వెలికి తీయండి : సిబ్బందికి టీటీడీ ఈవో పిలుపు

మీలోని సేవా శక్తిని వెలికి తీయండి : సిబ్బందికి టీటీడీ ఈవో పిలుపు
, గురువారం, 18 డిశెంబరు 2014 (20:30 IST)
తిరుమల తిరుపతి దేవస్థానం చాలా శక్తివంతమైన సంస్థ అనీ, అందులో పని చేసే అధికారులు సిబ్బంది చాలా శక్తి యుక్తులు కలిగిన వారని ఆ సంస్థ కార్యనిర్వహణాధికారి తెలిపారు. వారు తమలో శక్తిని వెలికి తీసి సంస్థ పేరు ప్రతిష్టలను మరింత ఇనుమడింప చేసేలా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. 
 
గురువారం సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానంలోని విభాగాధిపతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తప్పకుండా టిటిడి సిబ్బందిలోని శక్తి యుక్తులను వెలికి తీస్తారనే నమ్మకం తనుకుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. పని చేస్తే తప్ప వారికి మరింత పేరు ప్రతిష్టలు రావని ఆ దిశగా విభాగాధిపతులు మిగిలిన వారిని ఉత్సాహ పరచాలని కోరారు. విద్యా,వైద్యం, ఆధ్యాత్మిక విభాగాలలో టిటిడి ఇప్పటికే సేవలు అందిస్తోందని, అందులోనే మరింత సేవలు అందేలా కష్ట పడాలని కోరారు. 
 
 తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థగా తీర్చిదిద్దడానికి అవసరమైన సహాయ సహకారాలు సిబ్బందికి తన నుంచి ఎప్పుడూ లభిస్తాయని ఆయన హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో తిరుపతి జేఈవో పోలా భాస్కర్, తిరుమల జేఈవో కె ఎస్ శ్రీనివాస రాజు, సిఈ చంద్ర శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
 

Share this Story:

Follow Webdunia telugu