తిరుపతిలోని శ్రీనివాస కళ్యాణమండపంలో నాలుగవ చౌల్ట్రీలో వీరవెంకట సత్యనారాయణ స్వామి కళ్యాణోత్సవం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆధ్యాత్మిక కార్యక్రమాలను మరింతగా విస్తరించనున్నట్లు ఆయన వివరించారు.
ఇప్పటికే టీటీడీ వెంకటేశ్వర వైభవోత్సవం, శ్రీనివాస కళ్యాణం, మనగుడి, ధర్మరథ యాత్ర తదితర కార్యాక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. అన్నవరం దేవస్థానం చిత్తూరు జిల్లాలోని చిత్తూరు, కుప్పం, ఎస్ఆర్ పురం ప్రాంతాలలో రథయాత్ర నిర్వహించడం ఆహ్వానించదగ్గ అంశమని చెప్పారు.