Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సాధారణ భక్తులకు అందుబాటులో 225 సేవా టికెట్లు

సాధారణ భక్తులకు అందుబాటులో 225 సేవా టికెట్లు
, శుక్రవారం, 27 ఫిబ్రవరి 2015 (06:49 IST)
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారికి వేకువజామున నిర్వహించే వివిధ సేవా టికెట్లను టిటిడి భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. శ్రీవారికి నిత్యం నిర్వహించే సేవ లైన తోమాల, అర్చన, మేల్‌చాట్‌ వస్త్రం, పూరాభిషేకం లాంటి టికెట్లను మార్చి నెలలో భక్తులకు టిటిడి సుమారు 225 టికెట్లను అందుబాటులో ఉంచింది. 
 
ఆర్జిత కుంభకోణంలో బయపడిన బల్క్‌ బుకింగ్‌ సేవాటికెట్లను టిటిడి రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ టికెట్లను ల్యాటరి పద్దతిలో భక్తులకు ప్రతినెలా అందజేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెలలో తోమాల సేవ 41, అర్చన సేవ 129, మేల్‌చాట్‌ వస్త్రం 09, పూరాభిషేకం 46 టికెట్లను కేటాయించింది. 
 
ఈ టికెట్లను పొందడానికి భక్తులు సేవ జరిగే ముందురోజున తిరుమలకు చేరుకుని సిఆర్‌ఓ కాంప్లెక్సులో ఉన్న విజయాబ్యాంకులో తమ పేర్లను, చిరునామాను, ఫోటో ఐడెంటీని నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వివరాలతో పాటు తమ మెబైల్‌ నెంబర్‌ ను కూడా ఎంట్రి చేసుకోవాలి. ఈ విధంగా సేవ జరిగే ముందురోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. శుక్రవారం సేవలకు సంబంధించిన టికెట్లను గురువారం తిరుమలలో లాటరీ పద్దతిన తీశారు. 

Share this Story:

Follow Webdunia telugu