Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బొప్పాయి పండు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?

బొప్పాయి పండు తింటే కలిగే ప్రయోజనాలు ఏమిటో తెలుసా?
, బుధవారం, 18 సెప్టెంబరు 2019 (09:40 IST)
సాధారణంగా చాలామంది పిల్లలు చాక్లెట్లు, ఐస్ క్రీం లాంటివి తినటానికి ఇష్టపడతారు. ఇవి ఆరోగ్యానికి చాలా హానికరము. వీటివల్ల తరచుగా జలుబు, దగ్గు, జ్వరం లాంటివి వస్తూ ఉంటాయి. కనుక పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే వారికి పండ్లను తినటం అలవాటు చేయాలి. ఏ సీజన్‌లో దొరికే పండును ఆ సీజన్లో పిల్లలకు పెట్టడం వల్ల వారికి అన్ని రకాల విటమిన్స్ అందుతాయి. దీనివలన పిల్లలు చదువులోను, ఆట పాటలలోను ఎంతో ఉత్సాహంగా పాల్గొంటారు. మరి ముఖ్యంగా బొప్పాయిలో చాలా రకాల ఔషధ గుణాలు ఉన్నాయి.
 
అవి ఏమిటంటే.. బొప్పాయి పండు ఇంట్లో ఉంటే ఇంటిల్లిపాదికీ గృహవైద్యంగా పని చేస్తుంది. ఎలా అంటే బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు, బీటా కెరోటిన్లు భారీగా ఉంటాయి. ఇవి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. ప్రోటీన్లను జీర్ణం చేసే పపాయిన్ అనే ఎంజైము బొప్పాయిలో సమృద్ధిగా ఉంటుంది. అందువల్ల భోజనం తర్వాత నాలుగు బొప్పాయి ముక్కలు తింటే అది కడుపులో ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూస్తుంది. ఇది మాంసాన్ని కూడా త్వరగా అరిగేలా చేస్తుంది. బొప్పాయిలో ఎ, బి, సి, ఇ విటమిన్లతో పాటు ఖనిజాలు, ప్లేవనాయిడ్స్ వంటి మరెన్నో పోషకాలు ఉంటాయి. 
 
కొలెస్ట్రాల్‌ని తగ్గించడం ద్వారా ఇది గుండె జబ్బులను నివారిస్తుంది. ఇది నరాల బలహీనతలను తగ్గించే మంచి టానిక్ కూడా. క్యాల్షియం, పాస్ఫరస్ ఐరన్, మెగ్నీషియం, 
 
సోడియం, పొటాషియం, గంధకం, క్లోరిన్ వంటి పోషకాలు తగు మోతాదులో ఉండటం వల్ల బొప్పాయి పలు శారీరక రుగ్మతలకు అడ్డుకట్ట వేయగలుగుతుంది. కంటి చూపుకు మేలు చేసే విటమిన్ ఎ, ఇలు కూడా బొప్పాయిలో ఉంటాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గోధుమ రొట్టెలు మృదువుగా వుండాలంటే?