Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేత్ర రోగంతో బాధపడేవారు గోంగూర తింటే?

gongura
, మంగళవారం, 15 నవంబరు 2022 (22:40 IST)
ఆంధ్రుల అభిమాన పచ్చడి గోంగూర. అందుకే గోంగూరను ఆంధ్రమాత అని అంటారు. ఇందులో క్యాల్షియం, ఇనుము, విటమిన్ ఎ, సి, రైబోఫ్లెవిన్, ఫోలిక్ యాసిడ్ మరియు పీచు ఎక్కువుగా ఉంటుంది. దీని ఉపయోగాలు ఏమిటో తెలుసుకుందాము.

 
రేచీకటి, రాత్రిపూట సరిగా చూపు కనపడక పోవడం అనే నేత్ర రోగంతో బాధపడేవారు గోంగూర తింటే ఫలితం వుంటుంది.
 
శరీరంలో వాపులు తీయడానికి గోంగూర, వేపాకు కలిపి నూరి వాడితే మంచి ఫలితం ఉంటుంది.
 
దగ్గు, ఆయాసం, తుమ్ములతో బాధ పడేవారు గోంగూరను తింటే మంచి స్వస్థత చేకూరుతుంది.
 
శరీరంలో నీరు చేరినప్పుడు ఈ ఆకు కూర పథ్యం చాలా మంచిది. అంతేకాకుండా ఇది మలబద్దకాన్ని తొలగిస్తుంది.
 
విరోచనాలు అధికంగా అయ్యేటప్పుడు కొండ గోంగూర నుంచి తీసిన జిగురును నీటితో కలిపి త్రాగితే ఉపశమనం లభిస్తుంది. 
 
గోంగూరలో ఐరన్ ఎక్కువుగా ఉండటం వలన కొంచెం ఎక్కువ తింటే అరగదు. కనుక జాగ్రత్త.
 
మూత్రపిండాలు లేదా మూత్రాశయంలోని రాళ్లతో బాధపడుతున్న వ్యక్తులు గోంగూరకి దూరంగా వుంటే మంచిది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

షార్ప్ ప్లాస్మాక్లస్టర్ టెక్నాలజీతో ఆస్తమా పేషెంట్లు శ్వాస పీల్చుకోవడంలో అద్భుత రిలీఫ్