Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నువ్వులు, తేనెతో పొట్ట వద్ద కొవ్వు కరిగిపోతుంది.. (video)

మహిళలు మూడు పదులు వయస్సు దాటితేనే బరువు పెరిగిపోతుంటారు. పొట్ట కూడా పెరిగిపోతుంది. అలా పొట్ట పెరిగిపోతూపోతే.. వెంటనే తేనె, నువ్వులు డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తేనె, నువ్వు

Advertiesment
Sesame seeds
, సోమవారం, 20 నవంబరు 2017 (17:32 IST)
మహిళలు మూడు పదులు వయస్సు దాటితేనే బరువు పెరిగిపోతుంటారు. పొట్ట కూడా పెరిగిపోతుంది. అలా పొట్ట పెరిగిపోతూపోతే.. వెంటనే తేనె, నువ్వులు డైట్‌లో చేర్చుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. తేనె, నువ్వులు రెండింటిలోనూ ప్రోటీన్లు, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి.

వీటిని తీసుకోవడం ద్వారా మహిళల్లో ఎముకలకు సంబంధించిన నొప్పులను దూరం చేసుకోవచ్చు. తద్వారా మహిళల్లో వెన్నునొప్పి వంటి సమస్యలుండవు. ఎదిగే పిల్లలకు కూడా తేనె, నువ్వులను రోజూ పెడితే చాలా మంచిది. పోషణ సరిగ్గా అందుతుంది. 
 
మహిళలు నువ్వుల పొడిని రెండు స్పూన్లు తీసుకుని ఒక స్పూన్ తేనెతో రోజూ తీసుకుంటే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది. పొట్ట వద్ద ఉన్న కొవ్వు వేగంగా కరుగుతుంది. తద్వారా బరువు తగ్గుతారు. ఆకలిని తగ్గించడం వల్ల తిండి అదుపులో ఉంటుంది. ఫలితంగా బరువు తగ్గవచ్చు. తేనె, నువ్వులు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు రావు. 
 
ఇలా నువ్వులు-తేనె కలిపి తీసుకోవడం ద్వారా రోజంతా చురుగ్గా వుంటారు. ఎంత పనిచేసినా అలసిపోరు. మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు తగ్గుతాయి. వాపులు పోతాయి.

నొప్పులు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. మచ్చలు, మొటిమలు పోతాయి. వెంట్రుకలు ఆరోగ్యంగా మారుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి. చుండ్రు సమస్య పోతుంది. జుట్టు రాలడం తగ్గుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వైలట్ కలర్ వంకాయతో మేలెంత?