Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇవి పాటిస్తే మీ ఒంట్లో ఎంత వేడైనా చిటికెలో ఎగిరిపోతుంది...

శరీరంలో వేడి అనేది చాలామందికి ఉండే ఆరోగ్య సమస్య. శరీరంలో వేడి చేయడం వల్ల చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వేడి వల్ల అంతర్గత అవయవాలకు నష్టం. వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు, కురుపులు, మూత్రం మంటతో రావడం, ముక్కులో నుంచి రక్తం కారడం, మైకం,

ఇవి పాటిస్తే మీ ఒంట్లో ఎంత వేడైనా చిటికెలో ఎగిరిపోతుంది...
, బుధవారం, 25 అక్టోబరు 2017 (21:32 IST)
శరీరంలో వేడి అనేది చాలామందికి ఉండే ఆరోగ్య సమస్య. శరీరంలో వేడి చేయడం వల్ల చాలా రకాల ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వేడి వల్ల అంతర్గత అవయవాలకు నష్టం. వేడి తిమ్మిర్లు, వేడి దద్దుర్లు, మొటిమలు, కురుపులు, మూత్రం మంటతో రావడం, ముక్కులో నుంచి రక్తం కారడం, మైకం, వికారం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. మితిమీరిన వేడి వాతావరణం, వేడిలో పనిచేయడం, వేడిని కలిగించే ఆహారాలను తీసుకోవడం, నీరు అతి తక్కువగా తాగడం ఇదంతా వేడి చేయడానికి కారణాలు.
 
ఈ సమస్యను అధిగమించేందుకు...  ఒక టీ స్పూన్ కరక్కాయ పొడిని తీసుకొని అందులో ఒక చెంచాడు పంచదారను కలిపి ఉదయం పూట ఖాళీ కడుపుతో తీసుకుంటే శరీరంలో వేడి తగ్గుతుంది. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. వెన్నె తీసేసిన మజ్జిగను తీసుకుంటే మంచిది. 
 
ఎప్పటికప్పుడు చల్లటి నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. రోజులో రెండు లేదా మూడుసార్లు కొబ్బరి నీళ్ళు తాగాలి. పల్చటి మజ్జిగలో ఉప్పు, నిమ్మకాయ కలుపుకొని తాగితే మంచిది. పాలలో తేనెను కలిపి తాగాలి. వంటకాలలో కొబ్బరినూనె, ఆలివ్ నూనెలను వాడాలి. రోజూ ఉదయాన్నే దానిమ్మ రసం తాగాలి. గసగసాలు శరీరాన్ని చల్లబరచడానికి బాగా పనిచేస్తాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చర్మంపై ముడతలు తొలగిపోవాలంటే..? తేనె, పాలను..?