Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉదయం నిద్ర లేచిన తర్వాత ఎంత నీటిని తాగాలి?

Advertiesment
water
, సోమవారం, 8 జూన్ 2020 (23:05 IST)
వేసవి ఎండల తీవ్రత ఇంకా తగ్గలేదు. ఈ నేపధ్యంలో చాలామంది మంచినీటిని తాగడానికి బదులు కూల్ డ్రింక్స్, హాట్ డ్రింక్స్ తాగి లేనిపోని రోగాలను కొనితెచ్చుకుంటున్నారు. సాధారణంగా ఒక వంతు పదార్ధానికి మూడు వంతుల నీటిని పుచ్చుకోవడం శరీర ధర్మం. అసలు ఎన్ని లీటర్ల నీటిని తీసుకోవాలో తెలుసుకుందాం.
 
1. పెద్దలు కనీసం ఐదు లీటర్ల నుంచి 6 లీటర్ల వరకు నీళ్లును తాగితే శరీరం సమతుల్యంగా ఉంటుంది.
 
2.  పిల్లల విషయానికొస్తే వారు 1 కేజీ నుండి 2 కేజీల వరకు ఆహారాన్ని తీసుకుంటారు కాబట్టి వారు రోజుకు 3 నుండి 4 లీటర్ల వరకు నీటిని తీసుకోవాలి.
 
3. ఉదయం నిద్రలేచిన వెంటనే లీటరు నుండి లీటరున్నర వరకు నీళ్లను త్రాగాలి.
 
4. నీళ్ళు తాగిన తర్వాత 20 నిమిషాల వరకు ఏ పదార్ధమూ తీసుకోకూడదు.
 
5. ముఖ్యంగా ఎండాకాలంలో ఎక్కువగా నీటి పరిమాణం ఉండే పదార్ధాలను అంటే ఆకుకూర, పండ్లలో కూడా 70 నుంచి 80 శాతం వరకు నీరు ఉంటుంది కనుక వాటిని ఎక్కువగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చుండ్రు పోవడానికి సులువైన మార్గం..?