Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అరగ్లాసు నీరు, అరగ్లాసు పాలు, రెండు ఎండు ఖర్జూరాలు వేసి మరిగించి తాగితే?

సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి చీటికి మాటికీ ఎలర్జీ బారిన పడుతుంటారు. దీంతో వారికి తుమ్ములు, జలుబు వస్తుంటాయి. ఇటువంటి ఇబ్బంది ఉన్నవారు ప్రతిరోజు పరగడుపున ఉసిరి పొడి, రసం తీసుకున్నట్టయ

Advertiesment
Home remedies for caugh n cold
, శనివారం, 3 సెప్టెంబరు 2016 (11:40 IST)
సాధారణంగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి చీటికి మాటికీ ఎలర్జీ బారిన పడుతుంటారు. దీంతో వారికి తుమ్ములు, జలుబు వస్తుంటాయి. ఇటువంటి ఇబ్బంది ఉన్నవారు ప్రతిరోజు పరగడుపున ఉసిరి పొడి, రసం తీసుకున్నట్టయితే ఫలితం ఉంటుందని గృహ వైద్యులు చెపుతున్నారు. 
 
ప్రతి రోజూ ఉదయం ఐదు నుంచి ఆరు తులసి ఆకులు నమిలి మింగటం కూడా మంచిదేనని వారు చెపుతున్నారు. అలాగే, ఒక స్పూన్ సొంఠి పొడి లేదా ఒక స్పూన్ అల్లం రసం తాగినా జలుబు, తుమ్ములు మటుమాయం అవుతాయని చెపుతున్నారు. 
 
అర గ్లాసు నీళ్ళలో ఐదు తులసి ఆకులు, ఐదు లవంగాలు వేసి మరిగించి, ఆ పైన చల్లార్చి తాగాలి. అర గ్లాసు నీరు, అరగ్లాసు పాలు కలిపి అందులో రెండు ఎండు ఖర్జూర పళ్ళు వేసి మరిగించి అవి సగం అయ్యే వరకు వేడి చేసి ఆ పైన చల్లార్చి రాత్రి పడుకునే ముందు తాగాలి. ఇదే పద్దతిలో దాల్చిన చెక్క వేసి మరిగించి, చల్లార్చి తాగాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాశ్మీరీ మటన్ ఘోస్ట్‌ను ఎలా తయారు చేస్తారు?