Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా వైరస్, ఎండాకాలం, ఎలాంటివి తింటున్నారు? (Video)

కరోనా వైరస్, ఎండాకాలం, ఎలాంటివి తింటున్నారు? (Video)
, గురువారం, 16 ఏప్రియల్ 2020 (23:25 IST)
కాలం మారుతున్న ప్రకారం తీసుకునే పదార్థాల్లోనూ మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా ఎండాకాలంలో తినాల్సిన ఆహారపదార్థాలంటూ కొన్ని వున్నాయి. వాటిని తీసుకుంటూ వుంటే ఆరోగ్య సమస్యలు దాదాపుగా దరిచేరవు. అలాంటి పదార్థాలు ఏమిటో చూద్దాం.
 
1. వేసవిలో ప్రధానంగా బాధించేది డీహైడ్రేషన్. నీళ్లు ఎక్కువగా తీసుకున్నప్పటికీ కాఫీ, టీల మోతాదును తగ్గించుకోవాలి. వీటిని అతిగా తీసుకోవడం వల్ల శరీరంలోని నీటి శాతం తగ్గి డీహైడ్రేషన్ ఎదురుకావచ్చు. శరీరం కూడా తేమని కోల్పోయి నిర్జీవంగా మారుతుంది.
 
2. నూనెలో వేయించినవి తగ్గించాలి. వేపుళ్లు, ఫ్రెంచ్ ఫ్రైస్, ఆలూ చిప్స్ వంటివి వాటిని దూరంగా ఉంచాలి. ముఖ్యంగా ప్రయాణాల సమయంలో వీటి జోలికి వెళ్లకూడదు. లేదంటే వికారం, అతిగా దాహం వేయడం వంటివి తప్పవు.
 
3. జంక్ పుడ్ కూడా ఈ కాలంలో మంచిది కాదు. ఇందులో అధికంగా కేలరీలు ఉండడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువ. పైగా పొట్ట ఉబ్బరం, గ్యాస్ వంటివి ఎదురవుతాయి.
 
4. ఎండలు పెరిగే క్రమంలో రోజువారీ తీసుకునే ఆహారంలో కారం, మసాలాల మోతాదును చాలా వరకు తగ్గించాలి. ఇవి శరీరంలోని వేడిని పెంచి జీవక్రియ రేటు మందగించడానికి కారణమవుతాయి.
 
5. మాంసాహారం కూడా అతిగా తినకూడదు. చికెన్, మటన్.... వంటివి ఈ కాలంలో జీర్ణ సంబంధ సమస్యల్నీ పెంచుతాయి. అరుగుదల మందగించడం, విరేచనాలు, మలబద్దకం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మంచినీరు తాగాక ఎంతసేపటికి ఆహారం తీసుకోవాలో తెలుసా?