Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయవచ్చా?

ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయవచ్చా?
, బుధవారం, 9 అక్టోబరు 2019 (10:26 IST)
ఆహారం తీసుకున్న తర్వాత కొన్ని విషయాలు చేయకూడదు. ముఖ్యంగా ఆహారం తీసుకున్న తర్వాత పండ్లను తీసుకోకూడదు. ఆహారం తీసుకున్న రెండు గంట తర్వాతే ఫ్రూట్స్ తీసుకోవాలి. లేదా ఆహారం తీసుకునేందుకు గంట ముందు పండ్లను తీసుకోవడం చేయాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  
 
టీ తాగకూడదు?
తేయాకులోని యాసిడ్స్ జీర్ణ సమస్యలను ఏర్పడేలా చేస్తుంది. అందుచేత టీ ఆహారానికి ముందో తర్వాతో తీసుకోకూడదు.
 
స్మోక్ చేయకండి?
ఆహారం తీసుకున్న తర్వాత ఒక సిగరెట్.. 10 సిగరెట్లు స్మోక్ చేసినంత ఫలితాన్నిస్తుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. తద్వారా క్యాన్సర్ వ్యాధి సోకే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
బెల్ట్‌ను లూజ్ చేయకండి:
ఆహారం తీసుకున్న తర్వాత బెల్ట్‌ను లూజ్ చేయకండి. ఇలా చేయడం ద్వారా ఆహారం పేగుల్లోకి సత్వరితంగా చేరుకుని జీర్ణసమస్యలను ఏర్పడేలా చేస్తుంది. 
 
స్నానం చేయకూడదు.. 
ఆహారం తీసుకున్న తర్వాత స్నానం చేయకూడదు. భోజనం తర్వాత స్నానం చేయడం ద్వారా చేతులు, కాళ్లలో రక్తప్రసరణ వేగిరం అవుతుంది. తద్వారా ఆహారం జీర్ణమయ్యేందుకు కావలసిన రక్త ప్రసరణ తగ్గిపోతుంది. దీంతో ఉదరంలోని ఆహారం జీర్ణం కావడం కూడా తగ్గిపోతుంది.  
 
భోజనం చేసిన వెంటనే నడవకూడదు. తిన్న వెంటనే నడవడం ద్వారా ఆహారంలోని ధాతువులు, విటమిన్స్‌ ఆరోగ్యానికి సక్రమంగా లభించవు.  
 
నిద్రపోకూడదు: 
ఆహారం తీసుకున్న వెంటనే నిద్రిస్తే తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాదు. ఇంకా గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గొంతులో పిల్లికూతలు... ఆస్తమా అడ్డుకోవడం ఎలా?