Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మజ్జిగలో వండిన అన్నం తింటే..?

Advertiesment
rice
బియ్యం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. బియ్యంలో విటమిన్స్, న్యూట్రియన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఖనిజాలు అధిక మోతాదులో ఉన్నాయి. బియ్యం అనారోగ్య సమస్యల నుండి కాపాడుతుంది. బియ్యాన్ని వేయించి ఉడికించి తీసుకుంటే.. కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఓ సారి తెలుసుకుందాం..
 
1. మిక్కిలివేడిగా ఉన్న అన్నాన్ని తింటే బలం హరించుకుపోతుంది. బాగా చల్లబడి మెతుకులు గట్టిపోయిన అన్నము అజీర్ణాన్ని కలిగిస్తుంది. వండిన అన్నాన్ని వేడి ఆరిన తరువాత తినాలి.
 
2. మజ్జిగలో వండిన అన్నము తింటే మూలవ్యాధి నివారిస్తుంది. నీరసాన్ని, వాత వ్యాధులను తగ్గిస్తుంది. రక్తాన్ని వృద్ధిచేస్తుంది. జలుబు పైత్యం పెరుగుతాయి.
 
3. బియ్యాన్ని వేయించి వండిన అన్నము కఫం, వాతం, పైత్యం వ్యాధులను తగ్గిస్తుంది. జ్వరాలు, క్షయ, అతిసార వ్యాధిని నివారిస్తుంది.
 
4. బియ్యాన్ని నాలుగురెట్ల నీళ్ళలో బాగా ఉడికించిన అన్నం తిన్న హృద్రోగాలు నయమవుతాయి. బలాన్ని కలిగిస్తుంది. నేత్రదోషాలను ఆమ దోషాలను, ఒంటి నొప్పులను పోగొడుతుంది.
 
5. బియ్యానికి పద్నాలుగురెట్ల నీళ్ళలో బాగా ఉడికించిన గెంజిలా చేసి తీసుకున్న జ్వరాలను, అతిసార వ్యాధులు హరిస్తాయి. వాత వ్యాధులు తగ్గిపోతాయి. జీర్ణశక్తి పెరుగుతుంది.
 
6. వేయించిన బియ్యం రెండు పాళ్ళు, వేయించిన పెసర పప్పు ఒక పాలు తీసుకుని వీటిని పద్నాలుగురెట్ల నీటిలో ఉడికించి.. ఒక పాత్రలో నూనె వేసి.. ఇంగువ, ఉప్పు, ధనియాలు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు కొద్ది కొద్దిగా వేసి.. తిరగబోత పెట్టి ఆ ఆహారాన్ని తిన్న త్రిదోషములను హరిస్తుంది. రక్తవృద్ధిని, ఆకలిని పెంచుతుంది. ప్రాణశక్తి వృద్ధి చెందుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తలస్నానానికి అరగంట ముందు అది రాస్తే చుండ్రు మటాష్...