Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సబ్జా నీరు తీసుకుంటే..?

సబ్జా నీరు తీసుకుంటే..?
, శనివారం, 22 డిశెంబరు 2018 (10:11 IST)
మహిళలు బరువు తగ్గాలనుకుంటున్నారా.. అయితే సబ్జాను నానబెట్టిన నీటిని తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. సబ్జా గింజలతో నానబెట్టిన నీటిని రాత్రి నిద్రపోయే ముందుగా తాగితే చక్కటి ఫలితాలుంటాయి. ఈ నీరు యాంటీ బయాటిక్‌లాగా పనిచేస్తుంది.
 
సబ్జా ఈ గింజలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల శరీర జీవక్రియల పనితీరు మెరుగుపడుతుంది. సబ్జా గింజలు నీటిలో వేయగానే కొంతసేపటికి ఉబ్బి జెల్‌ మాదిరిగా తయారవుతాయి. శరీర పనితీరుకు ఉపకరించే ఫ్యాటీ ఆమ్లాలతోబాటు అధికంగా పీచుని ఇవి కలిగివుంటాయి. 
 
ఇందులో మహిళలకు అవసరమైన ఫొలేట్‌, నియాసిన్‌, ఇంకా చర్మాన్ని అందంగా ఉంచే విటమిన్‌ ఇ లభించడంతోబాటు, శరీరంలో పేరుకున్న వ్యర్థాలను తొలగించడానికి కూడా ఇవి తోడ్పడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
శరీరంలోని క్యాలరీలను కరిగించడంలో సబ్జాగింజలు చాలా దోహదపడుతాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు సబ్జా వాటర్‌ను సేవించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
బ్యాక్టీరియా సంబంధిత సమస్యలను నివారిస్తుంది. ఈ నీటిని రాత్రిపూట తాగడం వలన మరునాటికి శరీరంలో పేరుకున్న వ్యర్ధాలు తొలగిపోతాయి. ఈ నీరు టైప్‌ 2 మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది. అంతేకాదు... ఈ నీరు దాహార్తిని తీర్చి డీహైడ్రేషన్‌ రాకుండా చూడటంతోపాటు బరువు తగ్గడానికి కూడా సహకరిస్తుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కాటేస్తున్న కేన్సర్ : యేడాదిలో 8.1 లక్షల మంది మృతి