Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

గుడ్డు సొనను కళ్లపై రాస్తే..?

Advertiesment
egg
, మంగళవారం, 5 ఫిబ్రవరి 2019 (14:26 IST)
గంటల తరబడి అదేపనిగా కంప్యూటర్ ముందు కూర్చుని పనిచేసేవారికి కళ్లు అలసటగా ఉంటాయి. అలానే బయటకు వెళ్ళినప్పుడు వాతావరణం కారణంగా కంట్లో దుమ్ము, ధూళి వెళ్లి కళ్లను ఒత్తిడికి గురిచేస్తాయి. ఈ సమస్యలతో కళ్లు కాంతిని కోల్పోతాయి. కంటికి తగినంత విశ్రాంతి లేకపోతే కూడా కళ్లు అలసటగా ఉంటాయి. దాంతో కంటి కిందట నల్లటి వలయాలు ఏర్పడుతాయి. 
 
ఇంకా చెప్పాలంటే.. కంటి నుండి నీరు కారడం, కళ్లమంట వంటి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది. వీటన్నింటి నుండి ఉపశమనం పొందాలంటే.. ఈ కింది చిట్కాలు పాటిస్తే చాలంటున్నారు. మరి అవేంటో ఓసారి పరిశీలిద్దాం.
 
1. కంటి మంటలను తగ్గించాలంటే... గుడ్డు తెల్ల సొనను తీసుకుని అందులో స్పూన్ మోతాదులో తేనె కలిపి కళ్లపై రాసుకోవాలి. 20 నిమిషాల పాటు అలానే ఉంచి.. ఆ తరువాత గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఆ నీటితో కళ్లను శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా క్రమంగా చేస్తే తప్పక ఫలితం ఉంటుంది.
 
2. గోరువెచ్చని నీటిలో కొంచెం ఉప్పు కలుపుకుని అందులో మెత్తటి బట్టను ముంచి దానిని కళ్ల మీద వేసుకుని ఓ అరగంటపాటు అలానే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే కంటి అలసట తగ్గుతుంది.
 
3. కళ్లు విపరీతంగా మండుతుంటే.. ఐస్‌క్యూబ్స్‌తో కళ్లపై మర్దన చేసుకోవాలి. ఓ 5 నిమిషాల పాటు అలానే చేయాలి. ఇలా చేస్తే కళ్ల ఒత్తిడి తగ్గుతుంది. ధనియాలు కూడా కంటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గ్లాస్ నీటిలో 2 స్పూన్ల ధనియాలు వేసి రాత్రంత నానబెట్టుకోవాలి. ఉదయాన్నే ఆ నీటిలో కొద్దిగా బెల్లం కలిగి తాగితే మంచిది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మానసిక ఒత్తిడితో బాధపడేవారికి...?