Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 13 April 2025
webdunia

భోజనం చేశాక ఇలా చేయొద్దు...

చాలా మంది భోజనం చేశాక టీలు సేవించడం, పండ్లు పుష్టిగా ఆరగించడం, స్నానం చేయడం వంటివి చేస్తుంటారు. నిజానికి భోజనం చేసిన తర్వాత ఓ గంట పాటు ఎలాంటి ఆహారం లేదా చిరు తిండ్లను తీసుకోరాదు. అలా చేయడం ఆరోగ్యానికి

Advertiesment
Meals
, సోమవారం, 20 ఆగస్టు 2018 (14:10 IST)
చాలా మంది భోజనం చేశాక టీలు సేవించడం, పండ్లు పుష్టిగా ఆరగించడం, స్నానం చేయడం వంటివి చేస్తుంటారు. నిజానికి భోజనం చేసిన తర్వాత ఓ గంట పాటు ఎలాంటి ఆహారం లేదా చిరు తిండ్లను తీసుకోరాదు. అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భోజనం తర్వాత ఏమేమి చేయకూడదో ఓ సారి తెలుసుకుందాం.
 
* చాలా మంది భోజనం చేసిన వెంటనే నిద్రపోయేందుకు పడకెక్కుతారు. నిజానికి తినగానే వెంటనే పక్కమీదకు చేరొద్దు. అలా నిద్రలోకి జారుకుంటే తిన్న ఆహారం జీర్ణమవ్వక ఇబ్బందులు తలెత్తుతాయి. 
 
* కొందరికి భోజనం చేయగానే స్నానం చేసే అలవాటు ఉంటుంది. ఇలా చేయడం వల్ల కాళ్లు, చేతుల్లోకి రక్త ప్రసరణ పెరుగుతుంది. దీనివల్ల పొట్ట చుట్టూ రక్తప్రసరణ తగ్గి జీర్ణవ్యవస్థ పనితీరు మందగించే ప్రమాదం ఉంది.
 
* భోజనం చేసేముందు కానీ, చేశాక కానీ వివిధ రకాల పండ్లు ఆరగించరాదు. ఇలా చేయడం వల్ల పొట్ట పెరుగుతుంది. రెండింటికీ మధ్య రెండు మూడు గంటల వ్యవధి ఉండాలి.
 
* అన్నం తిన్న తర్వాత టీ తాగితే భోజనం జీర్ణంకాదు. తేయాకులో ఉండే ఆమ్లాలు ఆహారంలో ఉండే మాంసకృత్తులను శరీరం వినియోగించుకోకుండా అడ్డుకుంటాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శొంఠిని సలసలా మరిగే నీళ్లలో కలిపి స్నానం చేస్తే?