Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తేనెతో మునగపొడి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?

తేనెతో మునగపొడి తీసుకుంటే ఏమవుతుందో తెలుసా?
, బుధవారం, 1 డిశెంబరు 2021 (23:05 IST)
ఎండిన మునగకాయలోని విత్తనాలను పొడిచెయ్యాలి. ఆ పొడిని ఒక చెంచా తేనేతో సేవించాలి. దీనివల్ల బి.పి కంట్రోల్ అయి ఆదుర్దా తగ్గుతుంది. మునగ రసం క్యారెట్ రసంతో కలిపి తాగాలి. పచ్చిదోస రసం, మునగ రసం చెరొక గరిటెడు కలిపి తాగినా మూత్రం సాఫీగా అవుతుంది.

 
మునగాకు రసంలో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే అజీర్ణ సంబంధ బాధ ఉండదు. మునగాకు పొడిని రోజూ పరగడుపున చెంచా పొడిని మజ్జిగలో కలుపుకుని తాగితే గాస్ట్రిక్ అల్సర్ దరిచేరదు.

 
మునగాకు రసంలో మిరియాల పొడి కలిపి కణతలపై రాయాలి. మునగ గింజలని చూర్ణం చేసి కషాయంగా వాడినా తలనొప్పికి ఉపశమనం కలిగిస్తుంది. మునగాకు నీడలో ఆరబెట్టి, పొడిచెయ్యాలి. ఆ పొడిలో నీళ్ళు కలిపి పేస్టులా చేసి తలకు రాసుకొని కొంత సేపు ఆగి తలస్నానం చెయ్యాలి. ఆ విధంగా చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది.

 
మునగ చెట్టు ఎండిన బెరడును ఆవుపాలలో మరిగించి కషాయం ఎండబెట్టాలి. ఆ పొడిని మూడు పూటలా నెలరోజులు తీసుకుంటే వీర్యవృద్ధి కలిగి చక్కని అంగస్తంభన అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐదు బాదం పప్పుల్ని రాత్రి నానపెట్టి ఉదయాన్నే మెత్తటి పేస్టులా చేసి...