Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దానిమ్మ తొక్కలను ఎండబెట్టుకుని పొడిచేసి...?

దానిమ్మ తొక్కలను ఎండబెట్టుకుని పొడిచేసి...?
, సోమవారం, 21 జనవరి 2019 (11:47 IST)
దానిమ్మ చూడడానికి ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. పోషక పదార్థాలు ఎక్కువగా ఏ పండులో ఉన్నాయని చెప్పొచ్చంటే.. అది దానిమ్మే. దానిమ్మ పండు తరచు తీసుకుంటే శరీరంలో రక్తం పెరుగుతుంది. దానిమ్మలో పొటాషియం, మెగ్నిషియం, విటమిన్ సి, కె వంటి ఖనిజాలు అధికంగా ఉన్నాయి. ఇవి పలురకాల అనారోగ్య సమస్యల నుండి కాపాడుతాయి. ఈ పండుని తీసుకోవడం వలన కలిగే మరికొన్ని ప్రయోజనాలు ఓసారి తెలుసుకుందాం...
 
1. హైబీపీతో బాధపడేవారు క్రమంగా గ్లాస్ దానిమ్మ జ్యూస్ తీసుకుంటే.. బీపీ అదుపులో ఉంటుంది. ఇంకా చెప్పాలంటే.. చాలామందికి అప్పుడప్పుడు కడుపునొప్పి ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఒక దానిమ్మ పండును తిని చూడండి.. తప్పక ఫలితం ఉంటుంది.
 
2. సాధారణంగా కొందరు వ్యాయామాలు ఎక్కువగా చేస్తుంటారు. అలాంటివారు.. ప్రతిరోజూ గ్యాస్ మోతాదులో దానిమ్మ జ్యూస్ తాగాలి. అప్పుడే మీరు కోల్పోయిన శక్తిని తిరిగి పొందుతారు. ఈ జ్యూస్ తాగడం వలన జ్వరం, ఇన్‌ఫెక్షన్స్ వంటి సమస్యలు కూడా రావని ఇటీవలే ఓ పరిశోధనలో వెల్లడించారు. 
 
3. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నవారు... క్రమంగా దానిమ్మ జ్యూస్ లేదా పండు తీసుకోవాలి. అప్పుడే రక్తం పెరుగుతుంది. లేదంటే.. ఈ రక్తం సమస్యతో పాటు మధుమేహ వ్యాధికి గురికావలసిన వస్తుందని చెప్తున్నారు. కాబట్టి దానిమ్మ పండును క్రమంగా తినండి.
 
4. దానిమ్మ పండు తీసుకోవడం వలన శరీరంలోని చెడు వ్యర్థాలు, బ్యాక్టీరియాలు కూడా తొలగిపోతాయి. మన శరీరంలో ఈ రెండు సమస్యలు తొలగిపోతే చాలు.. గుండెకు రక్తం బాగా సరఫరా అవుతుంది. దాంతో గుండె సంబంధిత వ్యాధులనుండి ఉపశమనం లభిస్తుంది.
 
5. దానిమ్మ తొక్కలను ఎండబెట్టుకుని పొడిచేసి నిల్వచేసుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజూ రాత్రివేళలో నిద్రకు ఉపక్రమించే ముందుగా గ్లాస్ పాలలో వేసి, కొద్దిగా చక్కెర కలిపి తీసుకోవాలి. ఈ రోజూ తాగితే.. కీళ్ల దగ్గర వాపులు, నొప్పులు తగ్గుముఖం పడుతాయి.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వేరుశెనగలు తీసుకుంటే.. ఏం జరుగుతుందో తెలుసా..?