Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనావైరస్, ఈ ఆహారంలో అది వుంది, విటమిన్ డి మాత్రలు ఇంకెందుకు?

కరోనావైరస్, ఈ ఆహారంలో అది వుంది, విటమిన్ డి మాత్రలు ఇంకెందుకు?
, బుధవారం, 15 జులై 2020 (19:22 IST)
కరోనావైరస్ ఇప్పుడు ఎవరిని ఎలా పట్టుకుంటుందో తెలియడంలేదు. ముఖ్యంగా విటమిన్ డి లోపం వున్నవారిని ఇది వేగంగా పట్టుకుంటుందని అంటున్నారు. ఐతే దీనికి సంబంధించి ఇంకా స్పష్టతలేదు. ఐతే విటమిన్ డి కోసం ఈ ఆహార పదార్థాలను తీసుకుంటే మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు. విటమిన్ డి శరీరంలో కావలసినంత వుంటే కరోనావైరస్ ను అడ్డుకోవచ్చంటున్నారు వైద్యులు. ఆ పదార్థాలు ఏమిటో చూద్దాం.
 
కోడిగుడ్లు: గుడ్డులోని తెల్లసొనలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. గుడ్డు సొనలో విటమిన్లు, ఖనిజ మరియు ఒమేగా -3 కొవ్వులకు అద్భుతమైన మూలం. గుడ్డు సొనలు ఆరోగ్యాన్ని మెరుగుపర్చడానికి సహాయపడే అనేక పోషకాలతో పాటు అధిక మొత్తంలో ఫోలేట్, విటమిన్ బి 12ను కలిగి ఉంటాయి. కాబట్టి కోడుగుడ్డును తీసుకోవడం మంచిది.
 
సాల్మన్ చేప: సాల్మన్ చేపలో విటమిన్ డి పుష్కలంగా వుంటుంది. సాల్మన్‌లో ఒమేగా -3 కొవ్వులు, ప్రోటీన్, పొటాషియం మరియు ఇతర పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అందువల్ల ఈ చేపలను తినడం వల్ల ఇమ్యునిటీ పవర్ పెరుగుతుంది.
 
పుట్టగొడుగులు: ఈ కాలంలో పుట్టగొడుగులు పుష్కలంగా లభిస్తుంటాయి. వీటిలో విటమిన్ డి వుంటుంది. కాబట్టి వీటిని కూడా తీసుకోవాలి. అలాగే విటమిన్ డి వున్న ఆవు పాలు, నారింజ రసం, తృణధాన్యాలు వంటివి తీసుకుంటూ వుంటే విటమిన్ డి మాత్రలను మింగాల్సిన అవసరం వుండదు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మునగ నూనె గురించి తెలిస్తే తప్పక వాడుతారు..