Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చక్కెర వ్యాధికి నత్త విషంతో చెక్

ప్రపంచ జనాభాలో సగం మంది బాధపడుతున్న వ్యాధి మధుమేహం. ఈ వ్యాధి బారిన మృత్యువాతపడుతున్న వారి సంఖ్య నానాటికీ అధికమైపోతోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ వ్యాధి మరింత విజృంభిస్తోంది.

Advertiesment
చక్కెర వ్యాధికి నత్త విషంతో చెక్
, బుధవారం, 14 సెప్టెంబరు 2016 (08:45 IST)
ప్రపంచ జనాభాలో సగం మంది బాధపడుతున్న వ్యాధి మధుమేహం. ఈ వ్యాధి బారిన మృత్యువాతపడుతున్న వారి సంఖ్య నానాటికీ అధికమైపోతోంది. ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఈ వ్యాధి మరింత విజృంభిస్తోంది. ఈ వ్యాధికి అడ్డుకట్ట వేసేందుకు ఎన్నో పరిశోధనలు చేస్తున్నా ప్రయోజనం మాత్రం నామమాత్రంగానే ఉంది. 
 
ఈ పరిస్థితుల్లో నత్తల విషయంలో చక్కెర్ వ్యాధికి చెక్ పెట్టొచ్చని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెపుతున్నారు. సముద్రపు నత్త విడుదల చేసే విషంతో చిన్నచిన్న చేపలు క్షణంలో అచేతనమైపోతాయి. దీంతో వాటిని హాయిగా ఆరగించేస్తుంది! 'కోనస్‌ జియోగ్రాఫస్' అనే ఆ నత్త విషం మధుమేహ రోగులకు అతి శక్తిమంతమైన ఇన్సులిన్‌ ఔషధంగా కూడా పనిచేస్తుందని ఆస్ట్రేలియాలోని వాల్టర్‌ అండ్‌ ఎలీజా హాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు తమ పరిశోధనల ద్వారా నిర్ధారించారు. 
 
దీని ఇన్సులిన్‌ ప్రొటీన్‌ 3డీ నిర్మాణాన్ని పరిశీలించగా.. మనుషుల శరీర కణాలు స్వీకరించేందుకు అనుకూలంగా ఉన్నట్లు తేలింది. దీంతో దీనిని ఔషధంగా వాడితే మధుమేహ రోగులకు అతివేగంగా పనిచేసే ఇన్సులిన్‌ను అందించేందుకు వీలు కానుందని వారు భావిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మొటిమ‌లు ఇలా చేస్తే... చిటికెలో మాయం!