Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మలేరియా దోమతో తమాషా కాదు... ప్రతి 45 సెకన్లకు...

మలేరియా దోమతో తమాషా కాదు. అలా కుట్టి ఇలా వెళ్లిపోతుంది. కానీ ఈ మలేరియా దోమ కాటుతో ప్రపంచంలో సగం మంది జనాభా మలేరియా బారిన పడే అవకాశం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతి 45 సెకన్లకు ఒక శిశువు మలేరియా దోమ కాటు మూలంగా ప్రాణం విడుస

Advertiesment
మలేరియా దోమతో తమాషా కాదు... ప్రతి 45 సెకన్లకు...
, మంగళవారం, 25 ఏప్రియల్ 2017 (15:52 IST)
మలేరియా దోమతో తమాషా కాదు. అలా కుట్టి ఇలా వెళ్లిపోతుంది. కానీ ఈ మలేరియా దోమ కాటుతో ప్రపంచంలో సగం మంది జనాభా మలేరియా బారిన పడే అవకాశం ఉన్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రతి 45 సెకన్లకు ఒక శిశువు మలేరియా దోమ కాటు మూలంగా ప్రాణం విడుస్తున్నట్లు లెక్కలు చెపుతున్నాయి. అలాగే మలేరియా మరణాల్లో 90 శాతం మరణాలు ఆఫ్రికా ఖండంలోనే చోటుచేసుకోవడం గమనార్హం. 
 
ఆర్థికంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశాల్లో మలేరియా వ్యాధి విజృంభిస్తున్నట్లు వైద్యులు చెపుతున్నారు. మలేరియా నిర్మూలకు అవసరమైన చర్యలు తీసుకోవలసిన ఆవశ్యకతను వారు వివరించి చెపుతున్నారు. మురికి గుంటలు, డ్రెయిన్స్, వంటివాటిలో దోమలు నిలువకుండా వాటి నిర్మూలకు చర్యలు తీసుకోవాలంటున్నారు. 
 
మలేరియా దోమ రాత్రిపూట కుడుతుంది. మనిషి రక్తంలోకి పేరసైట్లను ప్రవేశపెట్టి రోగానికి కారణమవుతుంది. మలేరియా వ్యాధి... 9 నుంచి 14 రోజులపాటు జ్వరం, వణకడం, వాంతులు వంటి లక్షణాలుంటే వెంటనే వైద్యులను సంప్రదించి చికిత్స చేయించాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాట్స్ సంబరాలు... ప్రముఖులకు ఆహ్వానాలు... నాట్స్ టీం