Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

స్మార్ట్ ఫోనును బాత్రూమ్‌లో ఉపయోగిస్తున్నారా?

స్మార్ట్ ఫోనును బాత్రూమ్‌లో ఉపయోగిస్తున్నారా?
, గురువారం, 21 జనవరి 2021 (22:08 IST)
స్మార్ట్ ఫోనును బాత్రూమ్‌లో ఉపయోగిస్తున్నారా? ఐతే మీ పని అయిపోయినట్టే. స్మార్ట్ ఫోన్ లేనిదే ప్రతి నిమిషం కూడా గడవని పరిస్థితి. ఎక్కడపడితే అక్కడ స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోతుంది. చివరకి టాయ్‌లెట్‌లో కూడా స్మార్ట్ ఫోన్లను వాడే వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇలా బాత్రూమ్‌ల్లో స్మార్ట్ ఫోన్లు వాడి వారికి పైల్స్ వ్యాధి తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొబైల్‌ను టాయిలెట్‌కు తీసుకెళ్లడం వల్ల కలిగే సమస్యల గురించి చూస్తే… టాయిలెట్‌కు వెళ్ళినప్పుడు ఫోన్‌ని తీసుకెళ్లడం వల్ల పైల్స్‌కి దారి తీస్తుంది.
 
యువతలో కూడా ఇది ఇప్పుడు వస్తోంది. మొబైల్ వల్ల పైల్స్ ఎందుకు వస్తుంది అనే విషయానికి వస్తే… ఫోన్‌ని వాడడం వల్ల సాధారణ సమయం కన్నా అధిక సమయం టాయిలెట్‌లోనే కూర్చుంటారు. దీని మూలంగా అది మారుతుంది. టాయ్‌లెట్‌‌లో స్మార్ట్ ఫోన్లను వాడటం ద్వారా కండరాలపై ఒత్తిడి పెరుగుతుంది. టాయిలెట్‌లో కూర్చుని పేపర్ చదివిన, మొబైల్‌‌ని ఉపయోగించిన సమస్య ఏమీ తెలీదు.
 
ఇలా ఎక్కువ సేపు టాయ్‌లెట్‌లో కూర్చుని ఉంటే పాయువు మరియు పురీషనాళం కండరాల నరాల పై ఒత్తిడి పడుతుంది. ఇది పైల్స్ సమస్యకు ఓ కారణం అవుతుంది. అలానే టాయిలెట్‌కు ఫోన్‌ తీసుకెళ్లడం ద్వారా దానికి బ్యాక్టీరియా అంటుకుంటుంది.
 
చేతులు శుభ్రం చేసుకున్న మొబైల్‌ని కడగడం కుదరదు కనుక మొబైల్‌కి అంటుకున్న బ్యాక్టీరియా మిమ్మల్ని ఇన్ఫెక్షన్ల బారిన పడేలా చేస్తుంది. కాబట్టి మొబైల్‌ని బాత్రూమ్‌లో ఉపయోగించకుండా ఉంటేనే మేలు. లేదంటే ఎన్నో సమస్యలు బారిన పడే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

క్యాటరాక్ట్‌ ఆరంభం- హెచ్చరిక గుర్తులు మరియు కారణాలు