Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బరువు తగ్గాలనుకునేవారు.. నూనెల్ని బాగా తగ్గించి.. పండ్లు, కూరగాయలు తీసుకోండి..

బరువు తగ్గాలనుకునే వారు అన్నం మానేయడం కాదు.. నూనెలు, చక్కెర్లు మానేస్తేనే ఫలితం ఉంటుంది. వీటివల్లే మన శరీరానికి అవసరమైన కొవ్వులు అందుతాయనే మాట నిజం. అన్నం ద్వారా లభించే కార్బోహైడ్రేట్లనే మానేసి వూరుకు

బరువు తగ్గాలనుకునేవారు.. నూనెల్ని బాగా తగ్గించి.. పండ్లు, కూరగాయలు తీసుకోండి..
, మంగళవారం, 27 జూన్ 2017 (10:37 IST)
బరువు తగ్గాలనుకునే వారు అన్నం మానేయడం కాదు.. నూనెలు, చక్కెర్లు మానేస్తేనే ఫలితం ఉంటుంది. వీటివల్లే మన శరీరానికి అవసరమైన కొవ్వులు అందుతాయనే మాట నిజం. అన్నం ద్వారా లభించే కార్బోహైడ్రేట్లనే మానేసి వూరుకుంటే సరిపోదు. కార్బొహైడ్రైట్‌ అధికంగా ఉండే కాయగూరలూ, పండ్లూ, ధాన్యాలూ కూడా పోషకాహారంలో భాగమేనని గుర్తుంచుకోవాలి.
 
బరువు తగ్గాలన్న తాపత్రయంలో అల్పాహారం, భోజనం మానేయడం వల్ల రోజంతా ఆకలితో ఉంటారు. ఫలితంగా ఒక్కసారిగా అధికంగా తినేస్తారు. లేదంటే చిరాకు, అసహనం వంటివీ ఎదురవుతాయి. ఇది బరువు పెరగడానికి కారణం అవుతుంది. క్రమంగా మీ జీవక్రియ రేటు పడిపోతుంది. అందుకే వీలైతే ఒక భోజనాన్ని ఒకేసారి తినడం కంటే మూడు సార్లు తినడం మంచిది. 
 
పీనట్‌ బటర్‌, చీజ్‌ తురుములను రోజుకి స్పూన్‌లో తీసుకోవడం మంచిది. వయసూ, బరువుని బట్టే ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఒక ఆరోగ్యవంతమైన మహిళ సగటున రోజుకి 60 గ్రాములు పప్పూ, 50 గ్రాముల వరకూ మాంసం తీసుకోవచ్చు. అన్నం, రాగులూ, జొన్నలూ, పాస్తా ఏవి తిన్నా సరే రోజుకి 270గ్రా నుంచి మూడొందల గ్రాములు మించకుండా తీసుకోవాలి. నూనెల్ని బాగా తగ్గించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చేతులు కడుక్కుంటే చాలు ఐడియాలు అమాంతంగా పుట్టుకొస్తాయట.. నిజమేనా?